భార్య శీలాన్ని శంకించిన కలియుగ భర్త

భార్య శీలాన్ని శంకించిన కలియుగ భర్త

husband tested her wife, osmanabad, maharashtra : టెక్నాలజీ అభివృధ్ది చెంది, విద్యావైజ్ఞానికంగా ఎంత అభివృధ్ది చెందుతున్నా ప్రజలు ఇంకా మూఢనమ్మకాలతో అమానుష ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. భార్యను శంకించిన పురాణ పురుషుల కధలు చాలా ఉన్నాయి. భార్య శీలాన్ని శంకించిన కలియుగ రాముడు భార్యను సలసల కాగే నూనెలో చేతులు పెట్టించాడు.

మహారాష్ట్రలోని ఉస్మావాబాద్ జిల్లా పరాండలోని కచాపురి చౌక్ లో నివసించే కారు డ్రైవర్, అతని భార్యకు ఫిబ్రవరి 11వ తేదీన గొడవ జరిగింది. భర్తపై కోపంతో ఆమె ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లింది. భార్య వెళ్లిపోయిన తర్వాత ఆమె కోసం డ్రైవర్ గాలింపు చేపట్టాడు. నాలుగు రోజులైనా ఆమె ఆచూకి లభించలేదు. ఐదో రోజు భార్యఫోన్ చేసి ఇంటికి వచ్చింది. అయితే ఇంటికొచ్చిన భార్య నాలుగు రోజులు ఎక్కడుందో …ఏమైందో అంతా వివరించింది.

గొడవపడి ఇంట్లోంచి వెళ్ళిపోయినరోజు కచాపురి చౌక్ లో బస్సుకోసం వేచి ఉండగా…ఇద్దరు వ్యక్తులు వచ్చి బలవంతంగా బైక్ పై తీసుకువెళ్లారని తెలిపింది. నాలుగురోజులు వారి వద్దే ఉంచుకున్నారని తనను ఏమీ చేయలేదని చెప్పింది. ఎలాగోలా వారి బారినుంచి తప్పించుకుని ఇంటికొచ్చానని తెలిపింది.

అయినా ఆమె భర్త ఆ మాటలు నమ్మలేదు. భార్య శీలాన్ని శంకించాడు. తమ(పర్ది) సంప్రదాయం ప్రకారం భార్య పాతివ్రత్యాన్ని పరీక్షించాలను కున్నాడు. ఈ మేరకు సలసల కాగే నూనెలో అయిదు రూపాయల బిళ్లవేసి దాన్నిచేతితోతియ్యమని ఆదేశించాడు.

కాగే నూనెలో వేసిన నాణేన్ని చేతితోతీయటంతో భార్య చేతికి గాయాలయ్యాయి. ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ ఘటనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె నిజం చెపుతోందో అబధ్ధం చెపుతోందో తెలుసుకోవాలని అలా చేసినట్లు భర్త చెప్పాడు. తప్పు చేస్తే కాళ్లు చేతులు కాలిపోతాయని ఆయన చెబుతున్నాడు.

భర్త చేసిన తీరుపై మహిళా సంఘాలు, మేధావులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. భర్తపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై మహారాష్ట్ర శాసనమండలి చైర్ పర్సన్ నీలమ్ గోర్హె ఆగ్రహం వ్యక్తం చేసారు. డ్రైవర్ ను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.