GST Officials : జీఎస్టీ అధికారులపై కేసు నమోదు

ఒక వ్యాపారవేత్త భార్యను విచారణ పేరుతో అక్రమంగా నిర్బంధించారనే ఆరోపణతో ఐదుగురు జీఎస్టీ అధికారులపై హైదరాబాద్ పోలీసలు కేసు నమోదు చేశారు.

GST Officials : జీఎస్టీ అధికారులపై కేసు నమోదు

F I R

GST Officials : ఒక వ్యాపారవేత్త భార్యను విచారణ పేరుతో అక్రమంగా నిర్బంధించారనే ఆరోపణతో ఐదుగురు జీఎస్టీ అధికారులపై హైదరాబాద్ పోలీసలు కేసు నమోదు చేశారు. 2019లో సెర్చ్ ఆపరేషన్ పేరుతో అక్రమంగా నిర్బంధించారంటు మహిళ ఫిర్యాదు చేసింది.

హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త సత్య శ్రీధర రెడ్డి కి చెందిన కంపెనీ టాక్స్ చెల్లింపు విషయంలో జీ.ఎస్.టీ అధికారులు 2019 లో ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించారు. సోదాలు అనంతరం ఫిబ్రవరి 27, 2019 రోజున శ్రీధర్ రెడ్డి భార్య రఘవిరెడ్డిని సెర్చ్ ఆపరేషన్ పేరుతో అక్రమంగా నిర్బంధించారని జి.ఎస్.టి అధికారులపై నేషనల్ మహిళా కమీషన్ కు ఆమె ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు  స్వీకరించిన నేషనల్ మహిళా కమిషన్  ఈ అంశంపై విచారణ చేయాలని హైదరాబాద్ పోలీసులను కోరింది. హైదరాబాద్ పోలీసులు  బాధితురాలి వద్ద నుండి వివరాలు సేకరించారు. బాధితురాలి ఫిర్యాదుతో ఏకీభవించిన పోలీసులు ఐదుగురు అధికారుల పై కేసు నమోదు చేసారు.

Also Read :M.K.Stalin : సీఎం ఇంటికి బాంబు బెదిరింపు