మ్యూజీషియన్ బాలభాస్కర్ మృతిపై సీబీఐ దర్యాప్తు
కారు ప్రమాదంలో చనిపోయిన కేరళ మ్యూజిషియన్ బాలభాస్కర్ మృతిపై ఆ రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. 2018 సెప్టెంబర్ 25న జరిగిన కారు ప్రమాదంలో బాలభాస్కర్తోపాటు అతని రెండేళ్ల కూతురు కన్ను మూశారు. అయితే బాల భాస్కర్ది అనుమానాస్పద మృతిగా ఆరోపిస్తూ అతని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేరళ ప్రభుత్వం బాలభాస్కర్ మృతిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశాలు జారీచేసింది.
బాలభాస్కర్ ప్రయాణిస్తున్న కారు తిరువనంతపురం సరిహద్దు ప్రాంతంలో జాతీయ రహదారి పక్కనున్న చెట్టుకు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాలభాస్కర్ భార్య లక్ష్మి, కారు డ్రైవర్ గాయాలతో బయటపడ్డారు. ఘటన జరిగిన సమయంలో బాలభాస్కర్ డ్రైవింగ్ చేస్తున్నాడని డ్రైవర్ చెబుతుండగా..అతని భార్య మాత్రం డ్రైవరే కారు నడుపుతున్నాడని స్టేట్మెంట్ ఇచ్చింది. దీంతో ఈ ప్రమాదంపై పలు అనుమానాలు నెలకొన్నాయి.
Kerala Government has ordered CBI inquiry into the death of musician Balabhaskar. Balabhaskar and his two-year-old daughter had died on September 25, 2018 in a car accident. The decision has been taken on a complaint of his father who had raised suspicion over his death. pic.twitter.com/4LGB6JUTe9
— ANI (@ANI) December 10, 2019