Maharashtra: సహజీవనం చేస్తున్న ప్రేయసిని చంపిన ప్రియుడు.. మృతదేహాన్ని బెడ్ కింద దాచి పరార్

ఒక వ్యక్తి తనతో సహజీవనం చేస్తున్న మహిళను హత్య చేశాడు. తాజా ఘటన మహారాష్ట్ర, ముంబై పరిధిలో జరిగింది. హార్ధిక్ షా అనే వ్యక్తికి, మేఘ (37) అనే మహిళతో మూడేళ్లుగా పరిచయం ఉంది. కొన్ని నెలలుగా వీళ్లు ముంబై సమీపంలోని అద్దె ఇంట్లో సహజీవనం చేసేవాళ్లు.

Maharashtra: సహజీవనం చేస్తున్న ప్రేయసిని చంపిన ప్రియుడు.. మృతదేహాన్ని బెడ్ కింద దాచి పరార్

Maharashtra: గత ఏడాది సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ తరహా హత్యలు అనేకం వెలుగు చూస్తున్నాయి. గతవారం ఢిల్లీకి చెందిన ఒక వ్యక్తి తన ప్రేయసిని చంపి, కొన్ని గంటల్లోనే మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఈ ఘటనలు మరువక ముందే మరో ఘటన జరిగింది.

MP Komatireddy: ఠాక్రేతో కోమటిరెడ్డి భేటీ.. ‘హంగ్’ వ్యాఖ్యలపై కోమటిరెడ్డిని ప్రశ్నించిన ఠాక్రే

ఒక వ్యక్తి తనతో సహజీవనం చేస్తున్న మహిళను హత్య చేశాడు. తాజా ఘటన మహారాష్ట్ర, ముంబై పరిధిలో జరిగింది. హార్ధిక్ షా అనే వ్యక్తికి, మేఘ (37) అనే మహిళతో మూడేళ్లుగా పరిచయం ఉంది. కొన్ని నెలలుగా వీళ్లు ముంబై సమీపంలోని అద్దె ఇంట్లో సహజీవనం చేసేవాళ్లు. ఇద్దరిలో మేఘ నర్సుగా పని చేస్తుండేది. హార్ధిక్ మాత్రం ఏ పనీ లేకుండా తిరిగేవాడు. మేఘ సంపాదన మీదే బతికేవాడు. ఇద్దరూ కలిసే ఉన్నప్పటికీ, మేఘ మాత్రమే సంపాదించడం, హార్ధిక్ ఖాళీగా ఉండటం వల్ల డబ్బు గురించి తరచూ గొడవలు జరిగేవని చుట్టుపక్కల వాళ్లు తెలిపారు. ఈ క్రమంలో ఇటీవల ఇద్దరి మధ్య గొడవ పెద్దదైంది.

KA Paul: గుజరాత్ అల్లర్లపై డాక్యుమెంటరీ తీసినందుకే బీబీసీపై ఐటీ రైడ్స్: కేఏ పాల్

దీంతో కోపం తెచ్చుకున్న హార్ధిక్, మేఘను హత్య చేశాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని తన బెడ్ కింద ఉండే సీక్రెట్ బాక్స్‌లో దాచి ఉంచాడు. తర్వాత ఇంట్లోని వస్తువులు అమ్మేసి, కొంత డబ్బు సేకరించాడు. ఈ డబ్బుతో పారిపోయేందుకు ప్రయత్నించాడు. కానీ, ఆలోపే ఈ హత్యకు సంబంధించిన సమాచారం పోలీసులకు తెలిసింది. వాళ్లు ఇంట్లో దాచిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. హార్ధిక్ కోసం వెతకగా అతడు రైలులో పాల్ఘర్ పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న విషయాన్ని గుర్తించాడు. వెంటనే పోలీసులు అక్కడి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. వాళ్లు నిఘా వేసి, హార్ధిక్‌ను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. కేసు విచారణ కొనసాగుతోంది.