Rape Attempted : విదేశీ మహిళపై అత్యాచారయత్నం
అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు నెల్లూరు జిల్లాలో కలకలం రేగింది. విదేశీ మహిళపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారయత్నం చేశారు. ఈ ఘటన సైదాపురం మండలం చాగణం అటవీప్రాంతంలో జరిగింది. అబ్రకం
Rape Attempted : అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు నెల్లూరు జిల్లాలో కలకలం రేగింది. విదేశీ మహిళపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారయత్నం చేశారు. ఈ ఘటన సైదాపురం మండలం చాగణం అటవీప్రాంతంలో జరిగింది. అబ్రకం గనులను చూపిస్తామని అటవీప్రాంతానికి తీసుకెళ్లిన దుండగులు…ఆమెపై అత్యాచారానికి యత్నించారు.
మృగాళ్ల బారినుంచి ఎలాగోలా తప్పించుకున్న బాధితురాలు.. రోడ్డుపై ఒంటరిగా వెళుతూ పోలీసులకు కనిపించింది. అప్పటికే నీరసించిపోయిన విదేశీయురాలిని చూసి పోలీసులు ప్రశ్నించడంతో అసలు విషయం వెలుగుచూసింది. సైదాపురం పోలీస్స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదుచేయడంతో.. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
బ్రిటన్లోని లితోనియాకు చెందిన బాధితురాలిని పోలీస్ వాహనంలో …చాగణం అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. అత్యాచారయత్నం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. ఈకేసులో ఒక నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాలప్రకారం ….. బ్రిటన్ లోని లితోనియాకు చెందిన మహిళ భారత్ లోని పలు పర్యాటక ప్రదేశాలు చూడటానికి చెన్నై వచ్చింది. అక్కడ ఆమెకు నెల్లూరు జిల్లా మనుబోలు మండలం బద్దివేలు వెంకన్నపాలెంకు చెందిన సాయి పరిచయం అయ్యాడు. సాయి స్పేర్ పార్ట్ వ్యాపారం చేస్తుంటాడు. వ్యాపారం నిమిత్తం చెన్నై వెళ్లినప్పుడు ఆమె పరిచయం అయ్యింది.
తనతో వస్తే పలు ప్రాంతాలు చూపిస్తానని చెప్పాడు. ఈక్రమంలో అతడిని నమ్మిన మహిళ సాయితో కలిసి మొదట బెంగుళూరు వెళ్లింది. అక్కడ కొన్నిపర్యాటక ప్రదేశాలు చూసిన తర్వాత ఈ రోజు నెల్లూరు జిల్లాలో కొన్ని ప్రాంతాలు చూపిస్తానని చెప్పి బెంగుళూరు నుంచి ఆమెతో కలిసి నెల్లూరు వస్తున్నాడు. ఈక్రమంలో దారిలో అతని స్నేహితుడు హమీద్ను గూడురులో కారు ఎక్కించుకున్నాడు.
Also Read : Love Story Tragedy : ఎనిమిదేళ్ల ప్రేమ, సహజీవనం-విషాదాంతం
ఇద్దరూ కలిసి ఆమెకు అభ్రకం గనులు చూపిస్తామని చెప్పి చాగణం అటవీ ప్రాంతంలోకి తీసుకువెళ్ళారు. అక్కడ నిర్మానష్యమైన ప్రదేశంలో ఆమెపై అత్యాచారం చేయబోగా ఆమె వారిని ప్రతిఘటించింది. దీంతో భయపడిన వారిద్దరూ ఆమెను అటవీ ప్రాంతంలో వదిలేసి కారు తీసుకుని పారిపోయారు.
Also Read : BJP MLAS : సస్పెన్షన్పై హైకోర్టులో పిటిషన్ వేసిన బీజేపీ ఎమ్మెల్యేలు
అక్కడి నుంచి నడుచుకుంటూ ప్రధాన రహదారిపైకి వచ్చింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న ఆమెను చూసిన పోలీసులు విషయం అడగ్గా ఆమె జరిగినదంతా వివరించింది. సైదాపురం పోలీసుస్టేషన్ లో ఆమె ఫిర్యాదు ఇవ్వగా పోలీసులు నిందితులిద్దరినీ గుర్తించారు. సాయిని అదుపులోకి తీసుకున్న పోలీసులు గూడూరు పోలీసు స్టేషన్ కు తరలించారు. కేసు విచారణ కొనసాగుతోంది.