Cell Phone Charging : సెల్ఫోన్ చార్జింగ్ పెట్టి మాట్లాడిన యువతి… షాక్ తో మృతి
సెల్ ఫోన్ చార్జింగ్ పెట్టినప్పుడు దాని నుంచి మాట్లాడవద్దని చాలామంది హెచ్చరిస్తూనే ఉంటారు. అయినా ఎవరూమాట వినరు.
Cell Phone Charging : సెల్ ఫోన్ చార్జింగ్ పెట్టినప్పుడు దాని నుంచి మాట్లాడవద్దని చాలామంది హెచ్చరిస్తూనే ఉంటారు. అయినా ఎవరూమాట వినరు. ఒకవైపు ఫోన్ చార్జి అవుతూనే ఉంటుంది. ఏదో రాచకార్యాలు మిగిలిపోయినట్లు ప్లగ్ పాయింట్ దగ్గరే నిలబడి ఫోన్ లో గంటల తరబడి మాట్లాడుతూ ఉంటారు కొందరు. అలా చార్జింగ్ లో పెట్టిన ఫోన్ లు పేలిపోయిన ఘటనలు చాలా ఉన్నాయి.
తాజాగా ఒక యువతి చార్జింగ్ పెట్టిన ఫోన్ నుంచి కాల్ చేసి మాట్లాడటం మొదలెట్టింది. అదే సమయంలో బయట వానకురుస్తోంది. ఆ సమయంలో తన ఇంటిమీద పిడుగు పడటంతో …ఫోన్ చార్జర్ ద్వారా విద్యుత్ ప్రవహించి…. షాక్కు గురై మరణించింది. ఈ విషాద ఘటన బ్రెజిల్ లోని సాంటారెమ్ అనే సిటీలో చోటు చేసుకుంది. ఇటీవలి కాలంలో బ్రెజిల్ లో వారం రోజుల పరిధిలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవటం ఇది మూడో సారి.
గత వారం అపొలినారియా జిల్లాలో సెల్ ఫోన్ చార్జింగ్ పెట్టి ఉపయోగించి పిడుగుపాటుకు గురై ఓ వ్యక్తి చనిపోయాడు. అలాగే.. కౌన్సిలర్ రాయ్ముండో బ్రిటో కూడా ఇలాగే చార్జింగ్ పెట్టి ఫోన్ ఉపయోగించి.. పిడుగుపాటుకు గురై మరణించాడు. తాజాగా ఒలివైరా అనే యువతి.. చార్జింగ్ పెట్టి ఫోన్ మాట్లాడుతూ.. పిడుగుపాటుకు గురై మృతి చెందింది. ఆమె పిడుగుపాటుకు గురికాగానే.. కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ.. ఫలితం దక్కలేదు. ఒలివైరా మృతి చెందినట్టు డాక్టర్లు తెలిపారు.
కాగా గత జులైలో మన దేశంలో కూడా గుజరాత్ కు చెందిన ఓ అమ్మాయి.. ఫోన్ చార్జింగ్ లో పెట్టి కాల్ మాట్లాడి.. ప్రాణాలు పోగొట్టుకుంది. 17 ఏళ్ల శ్రద్దా దేశాయ్ అనే గుజరాత్కు చెందిన యువతి ఫోన్ చార్జింగ్ పెట్టి.. కాల్ అటెండ్ చేసింది. ఆమె ఫోన్లో మాట్లాడుతుండగానే ఫోన్ పేలిపోయి తను ప్రాణాలు విడిచింది.