Terrorist Attack : మణిపూర్లో జవాన్లపై ఉగ్రవాదుల మెరుపు దాడి..కమాండింగ్ ఆఫీసర్ సహా ఏడుగురు మృతి
మణిపూర్లో జవాన్లపై ఉగ్రవాదులు మెరుపు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో కమాండింగ్ ఆఫీసర్ సహా ఏడుగురు మృతి చెందారు. చూరచాంద్పూర్ జిల్లా బెహియాంగ్ వద్ద జవాన్లపై ఉగ్రవాదులు దాడి చేశారు.
Terrorist attack on jawans : మణిపూర్లో జవాన్లపై ఉగ్రవాదులు మెరుపు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో కమాండింగ్ ఆఫీసర్ సహా ఏడుగురు మృతి చెందారు. చూరచాంద్పూర్ జిల్లా సింఘత్ లో బెహియాంగ్ వద్ద జవాన్లపై ఉగ్రవాదులు దాడి చేశారు. 46 అస్సాం రైఫిల్స్ యూనిట్ కాన్వాయ్పై దాడి చేశారు.
ఈ దాడిలో కమాండింగ్ ఆఫీసర్ విప్లప్ త్రిపాఠీ, అతని భార్య, కుమారుడు, మరో నలుగురు జవాన్లు మృతి చెందినట్టు సమాచారం. కమాండింగ్ ఆఫీసర్ కుటుంబ సభ్యులు, తక్షణ స్పందన సిబ్బంది కాన్వాయ్ లో ఉన్నట్లు తెలుస్తోంది.