ప్రేమజంటను బెదిరించి యువతిపై కానిస్టేబుల్‌ అత్యాచారం  

ప్రకాశం జిల్లాలో ఓ కానిస్టేబుల్‌ ఘాతుకానికి ఒడిగట్టాడు. ఓ ప్రేమజంటను బెదిరించి యువతిపై అత్యాచారం చేశాడు.

  • Published By: veegamteam ,Published On : January 10, 2020 / 01:43 AM IST
ప్రేమజంటను బెదిరించి యువతిపై కానిస్టేబుల్‌ అత్యాచారం  

ప్రకాశం జిల్లాలో ఓ కానిస్టేబుల్‌ ఘాతుకానికి ఒడిగట్టాడు. ఓ ప్రేమజంటను బెదిరించి యువతిపై అత్యాచారం చేశాడు.

ప్రకాశం జిల్లాలో ఓ కానిస్టేబుల్‌ ఘాతుకానికి ఒడిగట్టాడు. ఓ ప్రేమజంటను బెదిరించి యువతిపై అత్యాచారం చేశాడు. గద్దలగుండ్లకు చెందిన ఓ ప్రేమజంట ఏకాంతం కోసం ఒంగోలు నగరంలోని మంగమూరు రోడ్డు సమీపానికి వచ్చింది. ఆ సమయంలో కానిస్టేబుల్‌ ఆనంద్‌ ప్రేమజంటను బెదిరించాడు. యువతిని మరో ప్రాంతానికి తీసుకెళ్లి బెదిరించి ఆమెపై అత్యాచారం చేశాడు.

అనంతరం ఆ యువతిని మంగమూరు ప్రాంతంలో వదిలి వెళ్లాడు. దీంతో కానిస్టేబుల్‌ ఆనంద్‌పై ప్రియుడు ఫిర్యాదు చేశాడు. వెంటనే పోలీసులు కానిస్టేబుల్‌ ఆనంద్‌ను అరెస్ట్‌ చేశారు. కొత్తపట్నం పీఎస్‌లో ఆనంద్‌ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. ఆనంద్‌ గతంలోనూ ఓ ప్రేమికురాలిపై ఇదే తరహాలో అత్యాచారానికి పాల్పడి సస్పెండ్‌ అయ్యాడు. అయినా అతనిలో మాత్రం మార్పురాలేదు. 

కానిస్టేబుల్ ఆనంద్‌ సోదరుడు ఇంకొల్లు రాంబాబు సిఐ కావడంతో.. విషయం బయటకు రాకుండా పోలీసులు అత్యంత గోప్యంగా విచారిస్తున్నారు. అయితే ఈ సంఘటనను జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ సీరియస్‌గా తీసుకోవడంతో పోలీసుల సయోధ్య బెడిసి కొట్టింది. నిందితునిపై చర్యలు తీసుకోవాల్సిందేనంటూ బాధితులు పట్టుపట్టడంతో తప్పని పరిస్థితుల్లో కానిస్టేబుల్ ఆనంద్‌ని కొత్తపట్నం ఎస్సై తాలూకా పోలీసులకు అప్పగించారు. ఘటనకు సంబంధించి ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు పోలీసులు. సిటీలోని సిసి పుటేజీలను పరిశీలిస్తున్నారు.