TSPSC Paper Leak : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో మరొకరు ఆరెస్ట్.. 13కు చేరిన నిందితుల సంఖ్య

TSPSC పేపర్ లీకేజీ కేసులో మరొకరు ఆరెస్ట్ అయ్యారు. మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్ పేట్ ఉపాధి హామీ (ఈసీ) అధికారి ప్రశాంత్‌ సిట్ అరెస్ట్ చేసింది. పేపర్ కొనుగోలు చేసి ప్రశాంత్ పరీక్ష రాశారు.

TSPSC Paper Leak : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో మరొకరు ఆరెస్ట్.. 13కు చేరిన నిందితుల సంఖ్య

TSPSC

TSPSC Paper Leak : టీఎస్పీఎస్సీ(TSPSC)పేపర్ లీకేజీ వ్యవహారం సంచలనం కలిగిస్తున్న విషయం తెలిసిందే. ఈ కేసులో సిట్ ముమ్మర దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే 12 మందిని సిట్ అధికారులు అరెస్టు చేశారు. నిందితుల విచారణలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. TSPSC పేపర్ లీకేజీ కేసులో మరొకరు ఆరెస్ట్ అయ్యారు. మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్ పేట్ ఉపాధి హామీ (ఈసీ) అధికారి ప్రశాంత్‌ సిట్ అరెస్ట్ చేసింది. పేపర్ కొనుగోలు చేసి ప్రశాంత్ పరీక్ష రాశారు. ప్రశాంత్ అరెస్టుతో పేపరు లీక్ కేసులో ఇప్పటివరకు మొత్తం 13 మంది నిందితులు ఆరెస్ట్ అయ్యారు.

కాగా, TSPSC పేపర్ లీకేజ్ కేసులో సిట్ మరోసారి కస్టడీ పిటిషన్ దాఖలు చేసింది. ఏ -1 ప్రవీణ్, ఏ -2 రాజశేఖర్, ఏ -4 డాక్య, ఏ -5 కేతావత్ రాజేశ్వర్, ఏ-10 షమీమ్, ఏ -11, సురేష్, ఏ -12 రమేష్ లను ఆరు రోజుల కస్టడీ కోరింది. సిట్ కస్టడీ పిటిషన్ ఫై శనివారం నాంపల్లి కోర్టు విచారణ జరుపనుంది. అంతకముందు 12 మంది నిందితులను సిట్ అధికారులు ఆరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలించారు. 12 మంది రీమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి.

TSPSC Paper Leak : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు.. అధికారిణి శంకర్ లక్ష్మీ విచారణలో కీలక విషయాలు

తొమ్మిది మంది నిందితులతో పాటు శుక్రవారం మరో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ ముగ్గురిలో ఇద్దరు టీఎస్పీఎస్సీ ఉద్యోగులు ఉన్నారని చెప్పారు. ఇప్పటివరకు నలుగురు టీఎస్పీఎస్సీ ఉద్యోగులను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. A-1 ప్రవీణ్ TSPSC సెక్రెటరీ పీఏ, A-2 రాజశేఖర్, నెట్వర్క్ అడ్మిన్, A-10 షమీమ్ ASO, A-12 రాజశేఖర్ డాటా ఎంట్రీ ఆపరేటర్ గా పని చేస్తున్నారు.
నిందితుల్లో మరో నలుగురు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారని తెలిపారు. 19 మంది సాక్ష్యులను విచారించినట్టు రీమాండ్ రీపోర్ట్ లో సిట్ అధికారులు పేర్కొన్నారు.

టీఎస్పీఎస్సీ ఉద్యోగి శంకర్ లక్ష్మిని ప్రధాన సాక్షిగా వెల్లడించారు. శంకర్ లక్ష్మితో పాటు టీఎస్పీఎస్సీ, తెలంగాణ స్టేట్ టెక్నీకల్ సర్వీస్ ఉద్యోగులను సాక్షులుగా పేర్కొన్నారు. కర్మన్ ఘాట్ లోని ఒక హోటల్ లోని యాజమని, ఉద్యోగిని సాక్షిగా పేర్కొన్నారు.  హోటల్ లోని సీసీటీవి కెమెరాలో పేపర్ ఎక్సెంజ్ వ్యవహారం నిక్షిప్తమైంది. ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు షమీమ్, రమేష్, సురేష్ లను సిట్ అధికారులు ఆరెస్ట్ చేశారు. ముగ్గురు నిందితుల నుండి ఒక ల్యాప్ టాప్ మూడు మొబైల్ ఫోన్స్ స్వాదినం చేసుకున్నారు.

TSPSC Paper Leak : TSPSC ప్రశ్నాపత్రాలు, గ్రూప్-1 ప్రశ్నాపత్రం లీక్ .. బీఆర్ఎస్ ప్రభుత్వంపై బండి సంజయ్ ఘాటు విమర్శలు

గ్రూప్-1లో 127 మార్కులు వచ్చిన షమీమ్ అనే నిందితుడు, 122 మార్కులు సాధించిన మరో నిందితుడు రమేశ్ సహా సురేశ్ అనే మరో నిందితుడిని పోలీసులు నిన్న (గురువారం) అరెస్టు చేశారు. వారిని నాంపల్లి కోర్టులో హాజరుపర్చగా వారికి న్యాయస్థానం రిమాండ్ విధించింది. అరెస్టు చేసిన ముగ్గురు నిందితులను కోర్టు ఆదేశాలతో చంచల్ గూడ జైలుకి తరలించారు. రమేశ్, సురేశ్, షమీమ్ 14 రోజులు(ఏప్రిల్ 6 వరకు) రిమాండ్ లో ఉండనున్నారు. అంతకముందు 9 మంది నిందితులను అరెస్టు చేసి, రిమాండ్ కు తరలించారు.

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా రమేశ్ పని చేస్తున్నాడు. అలాగే, షమీమ్ 2013లో గ్రూప్-2 ఉద్యోగం పొందాడు. రాజశేఖర్ నుంచి అతడు గ్రూప్-1 ప్రశ్నాపత్రం తీసుకున్నాడు. గ్రూప్-1 ప్రిలిమ్స్ ప్రశ్నపత్రాన్ని తను రాజశేఖర్ ఇచ్చాడని అధికారుల ముందు షమీమ్ అంగీకరించాడు. మరోవైపు ఎన్నారైలు కూడా పరీక్షలు రాశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని పలువురు నేతలు డిమాండ్ చేస్తున్నారు.