ఏడేళ్ల నిర్లక్ష్యం : 40 అడుగుల బోరు బావిలో రెండేళ్ల బాలుడు

  • Published By: madhu ,Published On : October 26, 2019 / 04:03 AM IST
ఏడేళ్ల నిర్లక్ష్యం : 40 అడుగుల బోరు బావిలో రెండేళ్ల బాలుడు

తమిళనాడు తిరుచ్చి జిల్లా మనప్పారై సమీపంలో అధికారులు నిర్లక్ష్యం కారణంగా రెండేళ్ల బాలుడు బోరుబావిలో పడిపోయాడు. ఇంటి సమీపంలో ఆడుకుంటూనే 40 అడుగుల లోతున్న బోరుబావిలో పడ్డాడు. పిల్లాడి ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు పరిసర ప్రాంతాల్లో గమనించారు. బోరుబావిలో నుంచి ఏడుపు వినిపించడంతో అనుమానంతో అధికారులకు సమాచారమిచ్చారు. 

హుటాహుటిన ఘటనా ప్రాంతానికి వచ్చిన అధికారులు బోరుబావిలో 30 అడుగుల కింద ఉన్నట్టు అధికారులు గుర్తించారు. రక్షించేందుకు మధురై నుంచి ప్రత్యేక బృందాన్ని రప్పించి బయటకు తీసేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా చేశారు. మనప్పారై, సేలం, నమక్కల్‌ నుంచి ఫైర్‌ అండ్‌ రెస్క్యూ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు.

స్థానికుల సాయంతో రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. బోరుబావికి సమాంతరంగా తవ్వుతున్నప్పటికీ.. బండ రాయి తగలడంతో తవ్వకాలకు ఆటంకం ఏర్పడింది. దీంతో మధురై నుంచి ప్రత్యేక యంత్రాన్ని తెప్పించారు. ఇప్పటికీ 14 గంటలు దాటిందని.. బాలుడు ఏడుపు వినిపిస్తోందంటూ అధికారులు చెబుతున్నారు.

బాలుడికి నిరంతరాయంగా ఆక్సీజన్ అందిస్తున్నామంటూ ఆరోగ్య శాఖ మంత్రి విజయ భాస్కర్ తెలిపారు. రెండేళ్ల బాలుడు సుజిత్‌ విల్సన్‌.. నడుకట్టుపట్టిలోని తన ఇంటి ముందు ఆడుకుంటుండగా.. ఏడేళ్ల క్రితం తవ్వి వదిలేసిన బోరుబావిలో పడ్డాడు.

అక్టోబర్ 25వ తేదీ శుక్రవారం సాయంత్రం ఐదున్నర సమయంలో సుజిత్ విల్సన్‌ బోరు బావిలో పడిపోయాడని తల్లిదండ్రులు చెబుతున్నారు. కొడుకుని ప్రాణాలతో బయటకు తీయమంటూ తల్లిదండ్రులు రోదిస్తున్నారు. 

 

Read More : దీపావళి రాకముందే : ఢిల్లీలో వాయు కాలుష్యం