యూపీలో ఆగని ఆకృత్యాలు, బర్త్ డే పేరిట హోటల్‌లో యువతిపై అత్యాచారం

  • Published By: madhu ,Published On : October 10, 2020 / 09:51 AM IST
యూపీలో ఆగని ఆకృత్యాలు, బర్త్ డే పేరిట హోటల్‌లో యువతిపై అత్యాచారం

Woman raped in hotel ; యూపీ రాష్ట్రంలో మహిళలపై ఆకృత్యాలు ఆగడం లేదు. ఎక్కడో ఒక చోట అత్యాచార ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా బర్త్ డే పార్టీ ఉందని చెప్పి..యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు కామాంధులు. ఆ యువతికి అండగా నిలవాల్సిన కుటుంబం..ఇంట్లోకి రానివ్వలేదు.




కాన్పూర్ లో 23 సంవత్సరాల యువతి కుటుంబంతో నివాసం ఉంటోంది. తన సోదరుడి బర్తే డే వేడుకలను హోటల్ లో జరుపుతున్నట్లు, రావాలని తన ఇంటికి సమీపంలో ఉన్న స్నేహితుడు Ashish కోరారు. హోటల్ కు వెళ్లగా..అక్కడ Ashish, అతని స్నేహితుడు అభిషేక్ ఉన్నారు. కొంత సమయం వీరు మాట్లాడుకున్న అనంతరం యువతికి కూల్ డ్రింక్ ఇచ్చారు. తాగిన వెంటనే స్పృహ కోల్పోయింది. లేచి చూడగా..తనపై అత్యాచారం జరిగిందని గుర్తించినట్లు తెలిపారు.




అయితే..ఘటన అనంతరం తిరిగి ఇంటికి చేరుకోగా..ఆమె కుటుంబం చితకబాదింది. ఇంట్లోకి రానివ్వలేదు. దీంతో ఆమె ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించింది. సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్ కు వెళ్లింది. ఈ విషయం ఆమెకున్న స్నేహితుల్లో ఒకరికి తెలిసింది. వెంటనే అక్కడకు చేరుకుని ఆమెను రక్షించారు.




అనంతరం Barra police station కు వెళ్లి ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆధునాతన టెక్నాలజీని ఉపయోగించారు. ఆశీష్, అభిషేక్ నిందితులను అరెస్టు చేశారు. యువతి స్టేట్ మెంట్ రికార్డు చేశామని, చర్యలు తీసుకుంటామని inspector Barra Harmeet Singh వెల్లడించారు.




మరో ఘటనలో ఫతేపూర్ లోని Lilauli గ్రామంలో గురువారం సాయంత్రం 20 ఏళ్ల దళిత మహిళపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు.