Man Abducted Sleeping Child : రైల్వే స్టేషన్లో నిద్రిస్తున్న మహిళ..ఆమె పసి బిడ్డను ఎత్తుకెళ్లిన వ్యక్తి
ఉత్తరప్రదేశ్లోని మథుర రైల్వే స్టేషన్లో దారుణం జరిగింది. రైల్వే స్టేషన్లో నిద్రిస్తున్న మహిళ పక్కన నిద్రలో ఉన్న ఆమె పసి బిడ్డను ఓ వ్యక్తి ఎత్తుకెళ్లాడు. ఫ్లాట్ఫామ్పై ఆగి ఉన్న రైలు ఎక్కి పారిపోయాడు. పోలీసులు బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మథురలోని అన్ని సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు.
Man Abducted Sleeping Child : ఉత్తరప్రదేశ్లోని మథుర రైల్వే స్టేషన్లో దారుణం జరిగింది. రైల్వే స్టేషన్లో నిద్రిస్తున్న మహిళ పక్కన నిద్రలో ఉన్న ఆమె పసి బిడ్డను ఓ వ్యక్తి ఎత్తుకెళ్లాడు. ఫ్లాట్ఫామ్పై ఆగి ఉన్న రైలు ఎక్కి పారిపోయాడు. అక్కడి రైల్వే స్టేషన్లోని ఫ్లాట్ఫామ్పై కొందరు నిద్రపోతున్నారు. బుధవారం(ఆగస్టు24,2022) తెల్లవారుజామున 4.28 గంటలకు ఒక వ్యక్తి వారిని పరిశీలిస్తూ నడుచుకుంటూ వెళ్లాడు. అనంతరం వెనక్కి వచ్చి ఒక మహిళ పక్కన నిద్రిస్తున్న ఏడు నెలల పాపను అపహరించాడు.
ఫ్లాట్ఫామ్పై ఆగి ఉన్న రైలులోకి ఎక్కి వెళ్లిపోయాడు. పసి పాప కనిపించకపోవడంతో చిన్నారి తల్లిదండ్రులు ఆందోళన చెందారు. రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రైల్వే స్టేషన్లోని సీసీటీవీ ఫుటేజ్లను పోలీసులు పరిశీలించారు. తల్లి పక్కన నిద్రిస్తున్న పసి పాపను ఒక వ్యక్తి అపహరించి పారిపోతున్న దృశ్యాలు అందులో రికార్డు అయ్యాయి.
Tragedy : రంగారెడ్డి జిల్లాలో నాలుగేళ్ల బాలుడు కిడ్నాప్, హత్య
పోలీసులు బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మథురలోని అన్ని సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. హత్రాస్, అలీగఢ్ ప్రాంతాల్లో కూడా తనిఖీలు చేశారు. నిందితుడి ఫొటోతో పాటు వీడియో క్లిప్ను అన్ని పోలీస్ స్టేషన్లకు పంపి అలెర్ట్ చేశారు. పోలీస్ అధికారి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.