Railway Notification : రైల్వేలో అప్రెంటిస్ భర్తీ నోటిఫికేషన్
హుబ్లిలోని సౌత్ వెస్టర్న్ రైల్వే(ఎస్డబ్ల్యూఆర్).. వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. డివిజన్ల వారిగా ఖాళీల వివరాలు పరిశీలిస్తే హుబ్లి డివిజన్–237, క్యారేజ్ రిపెయిర్ వర్క్షాప్–217, బెంగళూరు డివిజన్–230, మైసూరు డివిజన్–177, సెంట్రల్ వర్క్షాప్, మైసూరు–43 ఉన్నాయి. మొత్తం భర్తీ చేయనున్న ఖాళీలు 904.
Railway Notification : రైల్వేలో వివిధ డివిజన్లలో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు భారతీయ రైల్వే శాఖ నోటిఫికేషన్ జారీచేసింది.
వెస్ట్ సెంట్రల్ రైల్వేలో 2226 అప్రెంటిస్ నియామకాలు
జబల్ పూర్ ప్రధాన కేంద్రంగా ఉన్న వెస్ట్ సెంట్రల్ రైల్వే రిక్రూట్ మెంట్ సెల్ 2021-22 సంవత్సరానికి వివిధ ట్రేడుల్లో అప్పెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన ఆసక్తి కలిగిన అభ్యర్ధుల నుండి ధరఖాస్తులు కోరుతుంది. డీజిల్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, మెషినిస్ట్, టర్నర్, వైర్ మెన్, కార్పెంటర్, పెయింటర్, తదిర విభాగాలలో మొత్తం ఖాళీలు 2226 భర్తీ చేయనున్నారు.
అభ్యర్ధులు 50శాతం మార్కులతో పదవతరగతి తోపాటు సంబంధిత విభాగాల్లో ఐటిఐ ఉత్తీర్ణులై ఉండాలి. ధరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు 01.01.2021 నాటికి 15 నుండి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. పదోతరగతి, ఐటీఐలో సాధించిన మెరిట్ మార్కుల అధారంగా ఎంపిక ఉంటుంది. ఆన్ లైన్ ద్వారా ధరఖాస్తు చేసుకోవాలి. ధరఖాస్తుకు చివరి తేది 10.11.2021, పూర్తి వివరాలకు వెబ్ సైట్ https://wcr.indianrailways.gov.in
ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో 2206 అప్రెంటిస్ల భర్తీ
పాట్నా ప్రధాన కేంద్రంగా ఉన్న ఈస్ట్ సెంట్రల్ రైల్వేకు చెందిన రైల్వే రిక్రూట్మెంట్ సెల్ వివిధ డివిజన్లలో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఫిట్టర్, వెల్డర్, మెకానిక్(డీజిల్), కార్పెంటర్, ఎలక్ట్రానిక్ మెకానిక్, పెయింటర్, వైర్మెన్ తదితరాలు విభాగాలలో మొత్తం 2206 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 01.01.2021 నాటికి 15–24ఏళ్ల మధ్య ఉండాలి. పదో తరగతి, ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది 05.11.2021 పూర్తి వివరాలకు https://ecr.indianrailways.gov.in
సౌత్ వెస్టర్న్ రైల్వే, హుబ్లిలో 904 అప్రెంటిస్ల భర్తీ
హుబ్లిలోని సౌత్ వెస్టర్న్ రైల్వే(ఎస్డబ్ల్యూఆర్).. వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. డివిజన్ల వారిగా ఖాళీల వివరాలు పరిశీలిస్తే హుబ్లి డివిజన్–237, క్యారేజ్ రిపెయిర్ వర్క్షాప్–217, బెంగళూరు డివిజన్–230, మైసూరు డివిజన్–177, సెంట్రల్ వర్క్షాప్, మైసూరు–43 ఉన్నాయి. మొత్తం భర్తీ చేయనున్న ఖాళీలు 904.
ధరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ(ఎన్సీవీటీ/ఎస్సీవీటీ) ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 03.11.2021 నాటికి 15–24ఏళ్ల మధ్య ఉండాలి. పదో తరగతి, ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులకు చివరి తేది: 03.11.2021 పూర్తి వివరాలకు www.rrchubli.in