Somesh Kumar: రెవెన్యూ సదస్సుల నిర్వహణపై కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్

జిల్లా కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. శుక్రవారం జరిగిన ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్లతోపాటు అదనపు కలెక్టర్లు, ఆర్‌డీఓలు, ఇతర రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

Somesh Kumar: రెవెన్యూ సదస్సుల నిర్వహణపై కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్

Somesh Kumar

Somesh Kumar: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు ఆదేశాల మేరకు ఈ నె 15 నుంచి మండల స్థాయి రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సదస్సుల నిర్వహణపై జిల్లా కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. శుక్రవారం జరిగిన ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్లతోపాటు అదనపు కలెక్టర్లు, ఆర్‌డీఓలు, ఇతర రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. ఈ సదస్సుల నిర్వహణకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, విజయవంతం చేయాలని సోమేష్ కుమార్ సూచించారు.

China provokes India: ఇండియాను రెచ్చగొట్టిన చైనా.. లదాఖ్ సరిహద్దులోకి చైనా విమానం

రెవెన్యూ సదస్సు షెడ్యూల్స్‌పై విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు. రెవెన్యూ సదస్సు జరిగే వేదికల వద్ద మొబైల్ ఈ-సేవా కేంద్రం, ఇంటర్నెట్, ఇతర మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రెవెన్యూ సదస్సులలో వచ్చే అన్ని దరఖాస్తులకు రసీదులు ఇవ్వాలని స్పష్టం చేశారు. ఈ నెల 11న ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న జిల్లా కలెక్టర్ల సమావేశానికి జిల్లా అధికారులు పూర్తి సమాచారంతో రావాలని సూచించారు.