COVID-19: దేశంలో భారీగా తగ్గిన కరోనా రోజువారీ కేసులు… కొత్తగా 4,369 నమోదు

దేశంలో కరోనా రోజువారీ కేసులు భారీగా తగ్గాయి. కొత్తగా 4,369 కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం ఆసుపత్రులు/హోం క్వారంటైన్లలో చికిత్స తీసుకుంటున్న వారి సంఖ్య 46,347గా ఉందని పేర్కొంది. కరోనా రికవరీ రేటు 98.71 శాతంగా ఉన్నట్లు చెప్పింది. నిన్న దేశంలో కరోనా నుంచి 5,178 మంది కోలుకున్నారని పేర్కొంది. దేశంలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,39,30,417గా ఉందని చెప్పింది.

COVID-19: దేశంలో భారీగా తగ్గిన కరోనా రోజువారీ కేసులు… కొత్తగా 4,369 నమోదు

COVID 19

COVID-19: దేశంలో కరోనా రోజువారీ కేసులు భారీగా తగ్గాయి. కొత్తగా 4,369 కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం ఆసుపత్రులు/హోం క్వారంటైన్లలో చికిత్స తీసుకుంటున్న వారి సంఖ్య 46,347గా ఉందని పేర్కొంది. కరోనా రికవరీ రేటు 98.71 శాతంగా ఉన్నట్లు చెప్పింది. నిన్న దేశంలో కరోనా నుంచి 5,178 మంది కోలుకున్నారని పేర్కొంది. దేశంలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,39,30,417గా ఉందని చెప్పింది.

ఇప్పటివరకు కరోనా వల్ల భారత్ లో 5,28,185 మంది ప్రాణాలు కోల్పోయినట్లు వివరించింది. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 1.25 శాతంగా ఉందని పేర్కొంది. వారాంతపు పాజిటివిటీ రేటు 1.73 శాతంగా ఉన్నట్లు చెప్పింది. నిన్న దేశంలో 88.99 కోట్ల కరోనా పరీక్షలు చేసినట్లు వివరించింది. నిన్న 3,50,468 కరోనా పరీక్షలు చేసినట్లు చెప్పింది.

ఇప్పటివరకు దేశంలో 215.47 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు వేసినట్లు తెలిపింది. వాటిలో రెండో డోసులు 94.55 కోట్లు ఉన్నట్లు పేర్కొంది. బూస్టర్ డోసుల సంఖ్య 18.53 కోట్లుగా ఉన్నట్లు చెప్పింది. నిన్న దేశంలో 21,67,644 కరోనా వ్యాక్సిన్ డోసులు వేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.
Russia Ukraine war: ఉక్రెయిన్ తిరిగి తమ ప్రాంతాలను స్వాధీనం చేసుకుంటోంది: అమెరికా