Elon Musk: కొడుకు ప్రపంచ కుబేరుడు.. సరైన ఇల్లు లేక గ్యారేజ్‌లో నిద్రించిన తల్లి

ప్రపంచ కుబేరుడైన ఎలన్ మస్క్ తల్లి ఒక గ్యారేజ్‌లో నిద్ర పోయారట. తన కొడుకును కలిసేందుకు టెక్సాస్ వెళ్లిన తర్వాత, అక్కడ విలాసవంతమైన ఇండ్లు లేవని, దీంతో ‘స్పేస్ ఎక్స్’ కార్యాలయంలోని గ్యారేజ్‌లో నిద్ర పోయినట్లు ఎలన్ మస్క్ తల్లి మయే మస్క్ తెలిపారు.

Elon Musk: కొడుకు ప్రపంచ కుబేరుడు.. సరైన ఇల్లు లేక గ్యారేజ్‌లో నిద్రించిన తల్లి

Elon Musk: ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఎలన్ మస్క్. అంత సంపద ఉంది కాబట్టి, అతడి తల్లి విలాసవంతంగా జీవిస్తుందేమో అనుకుంటారు. కానీ, ఇటీవల ఆమె తన కొడుకును చూసేందుకు వెళ్లినప్పుడు ఒక గ్యారేజ్‌లో నిద్రపోయారట. ఈ విషయాన్ని స్వయంగా ఆమే ఒక మీడియా సంస్థకు వెల్లడించారు.

PM Modi: పోషకాహార లోపంపై పోరాడాలి.. ‘మన్ కీ బాత్’లో ప్రధాని మోదీ పిలుపు

ఎలన్ మస్క్ తల్లి మయే మస్క్.. కొంతకాలం క్రితం టెక్సాస్‌లోని మస్క్ దగ్గరికి వెళ్లింది. అయితే, అక్కడ సరైన నివాస వసతులు లేవు. దీంతో అక్కడి ‘స్పేస్ ఎక్స్’ కార్యాలయంలోని గ్యారేజ్‌లోనే నింద్రించినట్లు మయే మస్క్ తెలిపారు. ఆ ప్రదేశం వద్ద ఎలాంటి విలాసవంతమైన ఇండ్లు ఉండవని, అందువల్ల గ్యారేజ్‌లోనే నిద్రపోయానని ఆమె చెప్పారు. మయే మస్క్ అమెరికాలో ప్రముఖ మోడల్ కూడా. ఉద్యమకర్తగా కూడా ఉన్నారు. మయేకు ముగ్గురు పిల్లలు.. ఎలన్, కింబల్, టోస్కా. ఆమె తన భర్త ఎర్రోల్ మస్క్ నుంచి విడాకులు తీసుకున్నారు. ఈ ఘటన తన జీవితంలో అత్యంత కఠినమైందని ఆమె వ్యాఖ్యానించారు. భర్త నుంచి విడిపోయిన తర్వాత పిల్లల్ని పోషించేందుకు చాలా కష్టపడినట్లు తెలిపారు.

Maharashtra: విద్యార్థి చేయి విరిగేలా కొట్టిన టీచర్.. పోలీస్ కేసు నమోదు

గతంలో ఎలన్ మస్క్… తనకు సొంత ఇల్లు కూడా లేదని ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘‘నా స్థిరాస్తుల్ని అమ్మేస్తున్నాను. నాకు సొంత ఇల్లు కూడా లేదు. డబ్బు అవసరం లేదు. ఆస్తులు మీకు భారాన్ని పెంచుతాయి’’ అని ఎలన్ మస్క్ అన్నారు. 2020 నుంచి తన ఆస్తులను అమ్మేస్తున్నట్లు వెల్లడించాడు. ప్రస్తుతం ఆయన తన స్నేహితుడి ఇంట్లో ఉంటున్నట్లు చెప్పారు.