U.S. Commando Operation: గాజాలో అమెరికన్ బందీల విడుదలకు యూఎష్ రహస్య కమాండో ఆపరేషన్

ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో భాగంగా అమెరికన్ బందీలను రక్షించడానికి యూఎస్ రహస్య కమాండో ఆపరేషన్ ప్లాన్ చేస్తుందా? అంటే అవునంటున్నాయి వైట్‌హౌస్ వర్గాలు. గాజాలో బందీలుగా ఉన్న తమ పౌరులను రక్షించడానికి హమాస్‌పై హైరిస్క్ స్పెషల్ కమాండో ఆపరేషన్ నిర్వహించడాన్ని యునైటెడ్ స్టేట్స్ తోసిపుచ్చలేదు.....

U.S. Commando Operation: గాజాలో అమెరికన్ బందీల విడుదలకు యూఎష్ రహస్య కమాండో ఆపరేషన్

U.S. Commando Operation

Updated On : October 12, 2023 / 8:35 AM IST

U.S. Secret Commando Operation : ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో భాగంగా అమెరికన్ బందీలను రక్షించడానికి యూఎస్ రహస్య కమాండో ఆపరేషన్ ప్లాన్ చేస్తుందా? అంటే అవునంటున్నాయి వైట్‌హౌస్ వర్గాలు. గాజాలో బందీలుగా ఉన్న తమ పౌరులను రక్షించడానికి హమాస్‌పై హైరిస్క్ స్పెషల్ కమాండో ఆపరేషన్ నిర్వహించడాన్ని యునైటెడ్ స్టేట్స్ తోసిపుచ్చలేదు. హమాస్ మిలిటెంట్ల చేతిలో 11 మంది అమెరికన్లు మరణించినట్లు అమెరికా వైట్ హౌస్ ప్రతినిధి జాన్ కిర్బీ ధృవీకరించారు. ‘‘వాషింగ్టన్ ఇజ్రాయెల్‌తో సంప్రదింపులు జరుపుతున్నందున, అమెరికన్ బందీలు ఎక్కడ ఉన్నారో వారు ఏ స్థితిలో ఉన్నారో తెలుసుకోవడానికి ఆపరేషన్ చేపడుతున్నాం’’ అని అమెరికా వర్గాలు పేర్కొన్నాయి.

Also Read :US War Ship USS Gerald R Ford : ఇజ్రాయెల్‌కు వచ్చిన అమెరికా యుద్ధ నౌక వెరీ డేంజర్ గురూ

అమెరికన్లను చంపిన నేపథ్యంలో ఇరాన్‌ను అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ హెచ్చరించారు. ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్ చుట్టూ పూర్తిగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. యుద్ధం ఆరవ రోజుకు చేరడంతో ఇజ్రాయెల్ సైన్యం గాజా స్ట్రిప్‌లోని హమాస్‌ను లక్ష్యంగా చేసుకోవడం కొనసాగించింది. హమాస్ మృతుల సంఖ్య వేలల్లోకి పెరిగింది. ఇజ్రాయెల్, పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ మధ్య యుద్ధం ఆరవ రోజుకు చేరుకుంది. దీంతో ఇజ్రాయెల్ రక్షణ దళం హమాస్‌పై దాడిని వేగవంతం చేసింది. ఇజ్రాయెల్ అత్యవసర ఐక్య ప్రభుత్వాన్ని, యుద్ధ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.

Also Read :Israeli woman : ఇజ్రాయెల్ వీర వనిత 25 మంది ఉగ్రవాదులను హతమార్చింది…

యూఎస్ విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ ఇజ్రాయెల్ చేరుకోనున్నారు. ఇజ్రాయెల్ వివాదంలో జోక్యం చేసుకోవద్దని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఇరాన్‌ను హెచ్చరించారు. గాజాలో ఇజ్రాయెల్ రాత్రిపూట జరిపిన వైమానిక దాడుల్లో 51 మంది పాలస్తీనియన్లు మరణించారని మరియు 281 మంది గాయపడ్డారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.