TRS MLC: ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా.. ప్రకటించనున్న టీఆర్ఎస్

శాసనమండలి ఎమ్మెల్యే కోటాలోని ఆరుగురు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా సిద్ధమైంది.

TRS MLC: ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా.. ప్రకటించనున్న టీఆర్ఎస్

Trs

TRS MLC: శాసనమండలి ఎమ్మెల్యే కోటాలోని ఆరుగురు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా సిద్ధమైంది. ఈ మేరకు అభ్యర్థుల పేర్లను టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఖరారు చేశారు.

ఈ జాబితాను ఇవాళ(15 నవంబర్ 2021) విడుదల చేయనున్నారు. మరోవైపు నామినేషన్ల దాఖలు రేపటితో ముగియనుంది. దీంతో ఎంపికైన అభ్యర్థులు ఈ రోజే నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఒక్కో అభ్యర్థికి మద్దతుగా కనీసం పదిమంది ఎమ్మెల్యేలు నామినేషన్‌ పత్రాలపై సంతకాలు చేయాల్సి ఉంటుంది.

నామినేషన్‌ పత్రాలపై వారి పేర్లను ప్రతిపాదిస్తూ సంతకాలు చేసేందుకు అందుబాటులో ఉండాల్సిందిగా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు అధిష్టానం నుంచి ఆదేశాలు వెళ్లాయి. దీంతో నియోజకవర్గాల్లో ఉన్న టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు హైదరాబాద్‌కు చేరుకున్నారు.

119 మంది సభ్యులున్న అసెంబ్లీలో టీఆర్‌ఎస్‌కు 103 మంది సభ్యుల బలం ఉంది. దీంతో మొత్తం ఎమ్మెల్యేల మద్దతుతో టీఆర్‌ఎస్‌ ఆరు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకోనుంది. టీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ సామాజిక సమీకరణాలు, జిల్లాలవారీగా ఎమ్మెల్సీల లెక్కలను వేసుకుని అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు తెలిసింది.

ఎమ్మెల్యే కోటా ఆరుస్థానాల్లో ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ మాజీ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ పేరు దాదాపు ఖరారైనట్లు సమాచారం. బీసీ సామాజిక వర్గానికి రెండు లేదా మూడు స్థానాలను ఇవ్వాలనే ఉద్దేశంతో ఎల్‌.రమణ, మధుసూదనాచారితోపాటు మరో ఐదు పేర్లు ప్రధానంగా పరిశీలించినట్లు చెబుతున్నారు.

Kuppam : ఏపీలో మున్సిపల్ ఎన్నికలు..అందరి దృష్టంతా కుప్పంపైనే