Yadadri : యాదాద్రిలో మార్చి 4 నుంచి బ్రహ్మోత్సవాలు

మార్చి 4 నుంచి 14 వ‌ర‌కు ఉత్సవాల‌ను నిర్వహించ‌నున్నారు. ఇందులో భాగంగా మార్చి 11న బాలాల‌యంలో స్వామి వారి తిరు కళ్యాణం జ‌ర‌గ‌నుంది.

Yadadri : యాదాద్రిలో మార్చి 4 నుంచి బ్రహ్మోత్సవాలు

Yadadri

Updated On : February 22, 2022 / 8:20 AM IST

Yadadri Brahmotsavalu : యాదాద్రి లక్ష్మీన‌ర‌సింహ‌స్వామి ఆలయం… వార్షిక‌ బ్రహ్మోత్సవాల‌కు సిద్ధమవుతోంది. మార్చి 4 నుంచి బ్రహ్మోత్సవాలను నిర్వహించ‌నున్నట్లుగా ప్రభుత్వం ప్రక‌టించింది. మార్చి 4 నుంచి 14 వ‌ర‌కు ఉత్సవాల‌ను నిర్వహించ‌నున్నారు. ఇందులో భాగంగా మార్చి 11న బాలాల‌యంలో స్వామి వారి తిరు కళ్యాణం జ‌ర‌గ‌నుంది.

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ప్రధానాలయ పునఃప్రారంభోత్సవంలో భాగంగా మార్చి 28న నిర్వహించే మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమాలను యాథావిధిగా నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో ఎన్‌.గీత పేర్కొన్నారు. ఆలయ పునఃప్రారంభోత్సవం సందర్భంగా మార్చి 21 నుంచి బాలాలయంలో యజ్ఞ, హోమాలు, వివిధ రకాల పూజలు నిర్వహిస్తామని చెప్పారు. కొండ కింద వసతుల కల్పన, యాగశాల పనులు పూర్తికానందున కొండ కింద యాగస్థలిలో నిర్వహించాల్సిన మహా సుదర్శన నారసింహ యాగాన్ని వాయిదా వేసినట్లు చెప్పారు.

CM KCR : యాదాద్రిలో ప్రెసిడెన్షియల్ సూట్, విల్లాలను ప్రారంభించిన సీఎం కేసీఆర్

మహాకుంభ సంప్రోక్షణకు మహా సుదర్శన నారసింహ యాగానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. మార్చి 28 వరకు బాలాలయంలో స్వామివారి దర్శనాలు కొనసాగుతాయని, అనంతరం బాలాలయంలో నెలకొల్పిన కవచమూర్తులను ప్రధానాలయానికి తరలిస్తామని, ఆ తరువాత బాలాలయాన్ని మూసివేయనున్నట్టు ఆమె స్పష్టం చేశారు.

మరోవైపు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి ఆలయ దివ్య విమాన గోపురం స్వర్ణతాపడానికి దాతల నుంచి విరాళాలు వస్తున్నాయి. నిన్న హైదరాబాద్‌ నాగోల్‌కు చెందిన ఎం భరత్‌రెడ్డి – సావిత్రి దంపతులు రూ.51,116 విరాళం సమర్పించారు. ఈ మేరకు ఆలయ ఈఓ ఎన్‌.గీతకు చెక్కును అందజేశారు.