Rahul Gandhi : రాహుల్కి మరో షాక్-ఎన్ఎస్యూఐ నేతలతో ములాఖత్ కి నో పర్మిషన్
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి తెలంగాణలో మరో షాక్ తగిలింది. ఈరోజు వరంగల్ లోజరిగే రైతు సంఘర్షణ సభలో పాల్గోంటున్న రాహుల్ , రేపు చంచల్ గూడ జైలులో ఉన్న ఎన్ఎస్ యూఐ నేతలతో ములాఖత్ అయ్యేందుకు అనుమతి కోరారు.
Rahul Gandhi : కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి తెలంగాణలో మరో షాక్ తగిలింది. ఈరోజు వరంగల్ లోజరిగే రైతు సంఘర్షణ సభలో పాల్గోంటున్న రాహుల్ , రేపు చంచల్ గూడ జైలులో ఉన్న ఎన్ఎస్ యూఐ నేతలతో ములాఖత్ అయ్యేందుకు అనుమతి కోరారు. కానీ అందుకు జైలు అధికారులు పర్మిషన్ ఇవ్వలేదు.
ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్ధులతో రాహుల్ సమావేశానికి యూనివర్సిటీ అధికారులు అనుమతి ఇవ్వలేదు. దీంతో ఎన్ఎస్యూఐ నాయకులు నిరసనకు దిగారు. వీరిని పోలీసులు అరెస్ట్ చేసి చంచల్ గూడ జైలుకు తరలించారు. రెండు రోజుల తెలంగాణ పర్యటనకు వస్తున్న రాహుల్ గాంధీ జైలులో ఉన్ననేతలతో సమావేశం అయ్యేందుకు కాంగ్రెస్ నాయకులు అనుమతి కోరాగా జైలు అధికారులు నిరాకరించారు.
Also Read : Hyderabad : హైదరాబాద్ పాతబస్తీలో గ్యాంగ్వార్