telangana congress: ప్రశాంత్ కిషోర్ విషయం హైకమాండ్ చూసుకుంటుంది: భట్టి విక్రమార్క

రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) విషయం పార్టీ హైకమాండ్ చూసుకుంటుందని అభిప్రాయపడ్డారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సీనియర్ నేత భట్టి విక్రమార్క.

telangana congress: ప్రశాంత్ కిషోర్ విషయం హైకమాండ్ చూసుకుంటుంది: భట్టి విక్రమార్క

Bhatti Vikramarka

telangana congress: రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) విషయం పార్టీ హైకమాండ్ చూసుకుంటుందని అభిప్రాయపడ్డారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సీనియర్ నేత భట్టి విక్రమార్క. పీకే విషయంలో హై కమాండ్ ఒక కమిటీ వేసిందని, ఆ కమిటీ నివేదిక చూసిన తర్వాత సోనియా గాంధీ తుది నిర్ణయం తీసుకుంటారని భట్టి విక్రమార్క చెప్పారు.

 

ఈ విషయంలో బీజేపీ తప్పుడు ఆరోపణలు చేస్తోందని, కాంగ్రెస్ పార్టీలో దీనిపై ఎవరికీ ఎలాంటి అనుమానాలు లేవన్నారు. పనిగట్టుకుని కొందరు పీకే విషయంలో ఆరోపణలు చేస్తున్నారని భట్టి విమర్శించారు. త్వరలోనే ఈ విషయంలో అధిష్టానం ఒక క్లారిటీ ఇస్తుందన్నారు. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ మాణిక్యం ఠాకూర్ చేసిన ట్వీట్‌లో తప్పేమీ లేదని, శత్రువును నమ్మొదన్నారు కానీ.. ఆ శత్రువు ఎవరో చెప్పలేదు కదా అని అభిప్రాయపడ్డారు.