Pawan Kalyan : ‘భీమ్లా నాయక్’ ఐదో షోకు గ్రీన్ సిగ్నల్

చాలా రోజుల నుంచి సినిమాలకి అయిదవ షోకి పర్మిషన్ ఇవ్వాలని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలని సినీ పెద్దలు కోరుతున్నారు. తాజాగా 'భీమ్లా నాయక్' సినిమాకి తెలంగాణ ప్రభుత్వం అయిదవ షోకి.........

Pawan Kalyan : ‘భీమ్లా నాయక్’ ఐదో షోకు గ్రీన్ సిగ్నల్

Bheemla

Pawan Kalyan :  పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా, నిత్యా మీనన్, సంయుక్త మీనన్ లు హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా ‘భీమ్లా నాయక్’. త్రివిక్రమ్ మాటలు రాయగా, సాగర్ కే చంద్ర దర్శకత్వలో ‘భీమ్లా నాయక్’ సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై నిర్మించారు. ఈ సినిమా ఫిబ్రవరి 25న రిలీజ్ అవ్వనుంది. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, ట్రైలర్లతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇవాళ సాయంత్రం ‘భీమ్లా నాయక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది.

చాలా రోజుల నుంచి సినిమాలకి అయిదవ షోకి పర్మిషన్ ఇవ్వాలని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలని సినీ పెద్దలు కోరుతున్నారు. తాజాగా ‘భీమ్లా నాయక్’ సినిమాకి తెలంగాణ ప్రభుత్వం అయిదవ షోకి పర్మిషన్ ఇచ్చింది. ఈ మేరకు నోటిస్ ని విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. భీమ్లా నాయక్ సినిమా నైజాం డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు తెలంగాణాని అయిదవ షో కోసం పర్మిషన్ అడగగా ఇందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

Pawan Kalyan : ‘భీమ్లా నాయక్’ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతో తెలుసా??

థియేటర్ల వద్ద హెవీ రష్ ని తగ్గించటానికి, బ్లాక్ టికెట్ల అమ్మకం జరగకుండా ఉండటానికి, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండటానికి భీమ్లా నాయక్ సినిమాకి ఐదో షో పర్మిషన్ ఇస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. ఈ పర్మిషన్ రెండు వారాల పాటు ఇవ్వడం గమనార్హం. ఫిబ్రవరి 25 నుంచి మార్చ్ 11 వరకు ఐదో షో పర్మిషన్ ఇచ్చారు. దీంతో సినిమాకి కూడా లాభాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది.

Bheemla Tg

Nani : నాని ‘అంటే సుందరానికి’ టీజర్ రిలీజ్..

తెలంగాణాలో పరిస్థితి ఇలా ఉంటే అటు ఆంధ్రాలో మాత్రం ఇంకా టికెట్ రేట్ల సమస్య కొనసాగుతూనే ఉంది . అంతే కాక అయిదో షోకి కూడా పర్మిషన్ ఇవ్వలేదు, బెనిఫిట్ షోలు కూడా పడే పరిస్థితి కనపడట్లేదు. దీంతో ఆంధ్రాలో పవన్ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.