Congress : కాంగ్రెస్ లోకి జిగ్నేష్ మేవానీ.. కన్నయ్య కుమార్
జేఎన్యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు, సీపీఐ నేత కన్నయ్య కుమార్, గుజరాత్కు చెందిన స్వతంత్ర ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవానీ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లుగా తెలుస్తోంది.
Congress : జేఎన్యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు, సీపీఐ నేత కన్నయ్య కుమార్, గుజరాత్కు చెందిన స్వతంత్ర ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవానీ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని విశ్వసనీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మహాత్మగాంధీ జయంతి రోజైన అక్టోబర్ 2న వీరిరువురు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. ఇక తాజాగా కన్నయ్య కుమార్, ఎంపీ రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. ఈ భేటీలో కాంగ్రెస్ లో చేరే అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది.
Read More : Punjab New CM : పంజాబ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న చరణ్జిత్ సింగ్ చన్నీ
కన్నయ్యను కాంగ్రెస్ పార్టీ బీహార్ అధ్యక్షుడిని చేసే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇక స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించిన జిగ్నేష్ మేవాని కూడా కాంగ్రెస్ నేతలతో టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక పంజాబ్ సీఎంగా ఎస్సీ సామజిక వర్గానికి చెందిన చరణ్ జిత్ సింగ్ ను ఎంపిక చేయడాన్ని జిగ్నేష్ స్వాగతించారు. ఈ నేపథ్యంలోనే జిగ్నేష్ కాంగ్రెస్ లో చేరుతున్నారన్న వార్తలకు బలం చేకూరుతోంది. అయితే 2022లో గుజరాత్ లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జిగ్నేష్ చేరిక కాంగ్రెస్ కు కొంతమేర కొలిసొచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
Read More : Chandigarh Court : అభ్యంతరం లేకపోతే 18 ఏళ్లలోపు మైనర్ బాలిక పెళ్లి చెల్లుతుంది – కోర్టు