Lata Mangeshkar : లతా మంగేష్కర్ పై స్మారక పోస్టల్ స్టాంప్ విడుదల.. త్వరలో..

తాజాగా లతా మంగేష్కర్ పై పోస్టల్ స్టాంప్ ని విడుదల చేస్తామని ప్రకటించారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. తాజాగా జరిగిన ఓ ప్రెస్ మీట్ లో లతాజీ గౌరవార్థం పోస్టల్ స్టాంపును.............

Lata Mangeshkar :  లతా మంగేష్కర్ పై స్మారక పోస్టల్ స్టాంప్ విడుదల.. త్వరలో..

Latha Mangeshkar

Lata Mangeshkar :   భారత గాన కోకిల లతా మంగేష్కర్‌ ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆదివారం సాయంత్రం సినీ, రాజకీయ, వివిధ రంగాల ప్రముఖులు, అభిమానుల మధ్య మహారాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో ఆమె అంత్యక్రియలు జరిగాయి. ఆమె మరణం భారత సినీ సంగీత పరిశ్రమకి తీరని లోటు.

తాజాగా లతా మంగేష్కర్ పై పోస్టల్ స్టాంప్ ని విడుదల చేస్తామని ప్రకటించారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. తాజాగా జరిగిన ఓ ప్రెస్ మీట్ లో లతాజీ గౌరవార్థం పోస్టల్ స్టాంపును ప్రవేశపెట్టేందుకు కేంద్రం రెడీగా ఉందని భారత రైల్వే, కమ్యూనికేషన్లు, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.

Lata Mangeshkar : ఒడిశా బీచ్‌లో లతా సైకత శిల్పం.. శిల్పి సుదర్శన్‌ ఘన నివాళులు

ఈ స్టాంప్ `నైటింగేల్ ఆఫ్ ఇండియా`కి తగిన గౌరవం అని అన్నారు. స్మారక స్టాంపుగా దీనిని విడుదల చేస్తామని తెలిపారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. భారత తపాలా శాఖ ప్రకారం స్మారక స్టాంపులు ముఖ్యమైన సంఘటనలు, వివిధ రంగాలలో ప్రసిద్ధి చెందిన వ్యక్తులు, ప్రకృతి లక్షణాలు, అందమైన లేదా అరుదైన వృక్ష, జంతుజాలం, ఆటలు.. మొదలైన వాటిని స్మరించుకుంటూ విడుదల చేస్తారు. ఇప్పుడు లతా మంగేష్కర్ స్మారకార్థం త్వరలో ఈ స్టాంపుని విడుదల చేయనున్నారు.
.