Team India: టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లోకి ఎవ‌రు వ‌చ్చారో చూడండి: బీసీసీఐ

మ్యాచ్ ముగిశాక టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెస్టిండీస్‌ దిగ్గజ క్రికెటర్‌ బ్రయాన్‌ లారా వ‌చ్చారు. ఈ వీడియోను బీసీసీఐ పోస్ట్ చేసింది. శిఖ‌ర్ ధావన్, య‌జువేంద్ర చాహ‌ల్, శ్రేయాస్ అయ్య‌ర్, శార్దూల్ ఠాకూర్‌తో లారా కొద్దిసేపు మాట్లాడారు.

Team India: టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లోకి ఎవ‌రు వ‌చ్చారో చూడండి: బీసీసీఐ

Lara

Team India: భార‌త్-వెస్టిండీస్ మ‌ధ్య ట్రినిడాడ్‌లో తొలి వ‌న్డే మ్యాచు ముగిసిన త‌ర్వాత ”టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లోకి ఎవ‌రు వ‌చ్చారో చూడండి” అంటూ బీసీసీఐ ఓ వీడియోను పోస్ట్ చేసింది. తొలి వన్డేలో టీమిండియా 3 పరుగుల తేడాతో విజయం సాధించిన విష‌యం తెలిసిందే. దీంతో 3 వ‌న్డేల‌ సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో టీమిండియా ఉంది. ఈ మ్యాచ్ ముగిశాక టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెస్టిండీస్‌ దిగ్గజ క్రికెటర్‌ బ్రయాన్‌ లారా వ‌చ్చారు. ఈ వీడియోనే బీసీసీఐ పోస్ట్ చేసింది.

COVID19: దేశంలో 1,52,200కి చేరిన కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య‌ 

శిఖ‌ర్ ధావన్, య‌జువేంద్ర చాహ‌ల్, శ్రేయాస్ అయ్య‌ర్, శార్దూల్ ఠాకూర్‌తో లారా కొద్దిసేపు మాట్లాడారు. కాగా, తొలి వ‌న్డేలో టీమిండియా ఇచ్చిన‌ 309 పరుగుల లక్ష్యంతో బరిలోకి వెస్టిండీస్ 50 ఓవ‌ర్ల‌లో 305/6 చేసింది. చివరి ఓవర్‌లో 15 పరుగులు అవసరం ఉండ‌గా 11 పరుగులు చేసింది. చివ‌రి ఓవ‌ర్ ఉత్కంఠగా సాగింది. ఇవాళ రాత్రి 7 గంటల నుంచి టీమిండియా-వెస్టిండీస్ మధ్య రెండో వన్డే ప్రారంభం కానుంది.