Covid in India..Mask must : భారత్ లో పెరుగుతున్న కరోనా కేసులు..ఆ రాష్ట్రంలో మళ్లీ మాస్కు నిబంధన తప్పనిసరి

కోవిడ్ కేసులు రోజు రోజుకు తగ్గుతున్నాయని సంతోషపడినంత సమయం కూడా లేదు కేసులు మరోసారి పెరగటానికి. గత కొన్ని రోజులుగా నిలకడగా నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్యలో పెరుగుదల కనిపిస్తోంది. దీంతో భారత్ వ్యాప్తంగా ఆందోళన పెరుగుతోంది. మళ్లీ పాత బాధలు తప్పవా? మాస్కులు గోల తప్పదా? అనే ఆందోళన నెలకొంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రజలు, అధికారులు అప్రమత్తమయ్యారు.

Covid in India..Mask must : భారత్ లో పెరుగుతున్న కరోనా కేసులు..ఆ రాష్ట్రంలో మళ్లీ మాస్కు నిబంధన తప్పనిసరి

Covid In India..mask Must

Covid in India : కోవిడ్ కేసులు రోజు రోజుకు తగ్గుతున్నాయని సంతోషపడినంత సమయం కూడా లేదు కేసులు మరోసారి పెరగటానికి. గత కొన్ని రోజులుగా నిలకడగా నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్యలో పెరుగుదల కనిపిస్తోంది. దీంతో భారత్ వ్యాప్తంగా ఆందోళన పెరుగుతోంది. మళ్లీ పాత బాధలు తప్పవా? మాస్కులు గోల తప్పదా? అనే ఆందోళన నెలకొంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రజలు, అధికారులు అప్రమత్తమయ్యారు. మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లోనే అత్యధిక సంఖ్యలో కొత్త కేసులు నమోదు కావటంతో ప్రజలు, అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ పరిణామాలతో మహారాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమవుతోంది. మరోసారి మాస్కుల నిబంధనను తప్పనిసరి చేసే యత్నాలు చేస్తోంది.

కరోనా రాకుండా కట్టడి చేసే చర్యలు ప్రారంభించింది. గతంలో సడలించిన నియమాలను మళ్లీ విధించే దిశగా యోచిస్తోంది. దీంట్లో భాగంగా బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించే నిబంధనను మళ్లీ తప్పనిసరి చేసింది. ఈ నిబంధనల్ని అమలు చేయటంలో భాగంగా..అదనపు చీఫ్‌ సెక్రటరీ జిల్లా అధికారులకు లేఖ రాశారు. రైళ్లు, సినిమాలు, బస్సులు, ఆడిటోరియంలు, ఆఫీసులు, ఆసుపత్రులు, కాలేజీలు, స్కూళ్లు వంటి ప్రదేశాల్లో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అంతేకాకుండా టెస్టింగ్‌, ట్రాకింగ్‌ను వేగవంతం చేయాలని సూచించారు.

గత వారంలో మహారాష్ట్రలోని 9 జిల్లాల్లో కొత్త కేసులు అధికంగా నమోదు అవుతున్నాయి. బీఏ.4, బీఏ.6 సబ్‌ వేరియంట్ కేసులు ఇటీవల నమోదయ్యాయి. దీంతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరించింది. కరోనా నిబంధనలూ పాటించాల్సిందేనని హెచ్చరించింది. దాదాపు మూడు నెలల తర్వాత జూన్‌ 1న మహారాష్ట్రలో రోజువారీ కేసుల సంఖ్య 1000 దాటింది. ముఖ్యంగా ముంబయి మెట్రోపాలిటన్‌ రీజియన్‌తో పాటు, థానే ప్రాంతాల్లో కేసులు భారీగా పెరిగాయి. పాజిటివిటీ రేటు కూడా ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

మరాఠి నూతన సంవత్సరం గుడిపడ్వా పర్వదినం సందర్భంగా గతంలో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో వైరస్ కేసులు తగ్గినందున మాస్కులు తప్పనిసరిగా ధరించాలనే నిబంధనను తొలగించింది. మాస్కులు వాడడం, వాడకపోవడం అనేది ప్రజల వ్యక్తిగత అభిప్రాయమని..ఇది నిబంధన కాదని వెల్లడించింది. సీఎం అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ తోపే వెల్లడించారు. ఈ క్రమంలో మరోసారి కోవిడ్ కేసులు పెరుగుతున్న క్రమంలో మరోసారి మాస్కుల నిబంధనను తప్పనిసరి చేసింది. మాస్కులు ధరించాల్సిందేనని ఆదేశాలిచ్చింది.