Uttar Pradesh Violence: రాష్ట్రపతి, ప్రధాని పర్యటన రోజే హింస జరగడం దురదృష్టకరం: మాయావతి
మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ ఉత్తరప్రదేశ్ నేత ఒకరు టీవీ డిబేట్లో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఓ వర్గం వారు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తుండడంతో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే.
Uttar Pradesh Violence: మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ ఉత్తరప్రదేశ్ నేత ఒకరు టీవీ డిబేట్లో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఓ వర్గం వారు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తుండడంతో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే 36 మందిని పోలీసులు అరెస్టు చేశారు. యూపీలోని కాన్పూర్లో చోటు చేసుకున్న ఈ ఘటనపై బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి స్పందిస్తూ బీజేపీ సర్కారుపై విమర్శలు గుప్పించారు.
Uttar Pradesh Violence: యూపీలో హింస్మాతక ఘటన కేసు.. 36 మంది అరెస్టు
కుల, మత, రాజకీయాలకు అతీతంగా నిందితులపై చర్యలు తీసుకోవాలని మాయావతి డిమాండ్ చేశారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని మోదీ ఉత్తరప్రదేశ్లో పర్యటించిన రోజే ఇటువంటి అల్లర్లు జరగడం దురదృష్టకరం, ఆందోళనకరమని ఆమె వ్యాఖ్యానించారు. పోలీస్ ఇంటెలిజెన్స్ వైఫల్యం చెందిందని విమర్శించారు. శాంతి భద్రతలు విఫమవుతుంటే రాష్ట్రానికి పెట్టుబులు ఎలా వస్తాయని, రాష్ట్ర అభివృద్ధి ఎలా జరుగుతుందని ఆమె నిలదీశారు. హింసాత్మక ఘటన కేసులో నిష్పక్షపాతంగా ఉన్నతస్థాయి విచారణ జరగాలని ఆమె అన్నారు.