Star Heroes : తారుమారవుతున్న హీరోల కథలు..

ఒక హీరో అనుకుంటే మరో హీరో సెట్ అవుతున్నాడు.. కథ ఒకరి కోసం రాసుకుంటే కథానాయకుడిగా మరొకరు కనిపిస్తున్నారు.. గతంలో ఇలాంటి స్టోరీలు చాలానే వినిపించాయి..

Star Heroes : తారుమారవుతున్న హీరోల కథలు..

Star Heroes

Star Heroes: ఒక హీరో అనుకుంటే మరో హీరో సెట్ అవుతున్నాడు. కథ ఒకరి కోసం రాసుకుంటే కథానాయకుడిగా మరొకరు కనిపిస్తున్నారు. గతంలో ఇలాంటి స్టోరీలు చాలానే వినిపించాయి. కొత్తగా మరికొన్ని మూవీస్ హీరోను మార్చి సెట్స్‌పై కెళ్తున్నాయి. ఏంటా సినిమాలు.. చేస్తున్న డైరెక్టర్స్ ఎవరు… మారిన హీరోలెవరు..?

హీరోల కథలు తారుమారు అవుతున్నాయి. స్టోరీ పట్టుకుని మొదట ఓ హీరో దగ్గరికెళ్తే.. చివరికొచ్చేసరికి మరో హీరో నటిస్తున్నారు. మేకర్స్ ముందు అనుకున్న హీరోలు వేరు.. తర్వాత సెట్ అవుతున్న స్టార్స్ వేరు. ఇప్పడలాగే వరుణ్ తేజ్ – ప్రవీణ్ సత్తారు మూవీ సెట్ అవుతోందని సమాచారం. ప్రెజెంట్ నాగార్జునతో మూవీ చేస్తోన్న ప్రవీణ్ సత్తారు.. హీరో రామ్ కోసం ఓ స్టోరీని రెడీ చేసి వినిపించారు. అయితే ఇన్నిరోజులు హోల్డ్‌లో పెట్టిన రామ్ చివరికి నో చెప్పడంతో ఇప్పుడా కథలో హీరోగా వరుణ్ తేజ్ ఫిక్సయ్యాడని తెలుస్తోంది.

Combinations : అనుకున్నదొక్కటి.. అవుతున్నదొక్కటి.. తెగ ఫీలైపోతున్న డైరెక్టర్స్, ఫ్యాన్స్..

హీరో రామ్ – తమిళ్ డైరెక్టర్ లింగుస్వామి ప్రాజెక్ట్ గురించి తెలిసిందే. లింగుస్వామి ఫస్ట్ అల్లు అర్జున్‌కి స్టోరీ చెప్పారు. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బన్నీ అధికారికంగా ప్రకటించారు కూడా. కానీ ఏమైందో తెలీదు సడెన్‌గా బ్రేక్ పడటంతో రామ్‌తో ఫిక్సయ్యారు లింగుస్వామి. అలాగే బన్నీ – సుకుమార్ ‘పుష్ప’ కథను ఫస్ట్ అనుకున్నది మహేష్ బాబుతో. అనూహ్యంగా మార్పులు జరిగి ‘పుష్ప రాజ్’ ప్లేస్‌లో మహేష్‌కి బదులు బన్నీ సెట్ అయ్యారని అంటుంటారు. ‘వకీల్ సాబ్’ డైరెక్టర్ వేణు శ్రీరామ్ బన్నీ కోసం ‘ఐకాన్’ ప్రాజెక్ట్ సిద్ధం చేశారు. కానీ అల్లు అర్జున్ ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో మరో హీరో ‘ఐకాన్’ గా మారుతాడనే టాక్ వినిపిస్తోంది.

‘అతడు’, ‘ఖలేజా’ తర్వాత త్రివిక్రమ్ – మహేష్ బాబు కాంబోలో సినిమా రానుంది. ఈ సినిమాను తొలుత ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్ ప్లాన్ చేశారని అంటారు. కరోనా కారణంగా లెక్కలు మారడంతో త్రివిక్రమ్ కాస్త స్టోరీని మార్చి.. మహేష్ బాబుతో తెరకెక్కించనున్నారని టాక్. ఇక రీసెంట్‌గా రవితేజతో సినిమా అనౌన్స్ చేసిన డైరెక్టర్ త్రినాథరావు నక్కిన.. మొదట కథ వినిపించింది వెంకటేష్‌కి. ‘ఆర్ఎక్స్ 100’ తర్వాత శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా ‘మహా సముద్రం’ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు అజయ్ భూపతి. అయితే మాస్ రాజా రవితేజతో మహా సముద్రాన్ని ఎక్స్‌పెక్ట్ చేశాడు అజయ్ భూపతి. కానీ రవితేజను శర్వానంద్ రీప్లేస్ చేశాడు. గతంలో కూడా నాని విన్న ‘జాను’, ‘శ్రీకారం’ సినిమాలు శర్వానంద్‌తో ఫైనల్ అయ్యాయి..