Satyapal Malik : మోదీని షా అంత మాట అన్నారా! మేఘాలయ గవర్నర్ వివరణ

రైతుల అంశం గురించి ప్రధాని,అమిత్ షా ను కలిసినప్పుడు జరిగిన విషయాల గురించి మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ తాజాగా హర్యానాలో జరిగిన ఓ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారం

Satyapal Malik : మోదీని షా అంత మాట అన్నారా! మేఘాలయ గవర్నర్ వివరణ

Malik Modi Shah

Satyapal Malik : రైతుల అంశం గురించి ప్రధాని,అమిత్ షా ను కలిసినప్పుడు జరిగిన విషయాల గురించి మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ తాజాగా హర్యానాలో జరిగిన ఓ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో మేఘాలయ గవర్నర్ తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు.

గతంలో తాను ఒకసారి వ్యవసాయ చట్టాల గురించి మోదీని కలిసినప్పుడు..మోదీ చాలా విముఖంగా ఉన్నారని,తాను చెప్పేది వినడానికి మోదీ అప్పుడు సిద్ధంగా లేరని,అమిత్ షాను కలవాలని మోదీ తనకు చెప్పారని సోమవారం ఓ ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చారు సత్యపాల్ మాలిక్.

ఇక అమిత్ షాను తాను కలిసినప్పుడు అమిత్ షా తనతో.. “మోదీని ప్రజలు తప్పుదోవపట్టిస్తున్నారని(ప్రస్తుతం రద్దు అయిన వ్యవసాయ చట్టాల విషయంలో)ఏదో ఒక రోజు మోదీ ఇది అర్థం చేసుకుంటారు అని” అన్నారని మాలిక్ తెలిపారు. ప్రధాని గురించి చెడుగా అమిత్ షా ఏమీ చెప్పలేదని తాను క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నట్లు మాలిక్ సృష్టం చేశారు. అమిత్ షా కు మోదీ అంటే చాలా గౌరవం అని మాలిక్ తెలిపారు. తన ఆందోళనను అర్థం చేసుకుంటామని మాత్రమే అమిత్ షా చెప్పారని మాలిక్ తెలిపారు.

అసలేం జరిగింది

సోమవారం కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ లో షేర్ చేసిన వీడియోలో మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ మాట్లాడుతూ..”రైతుల అంశంపై నేను ప్రధానిని కలడానికి వెళ్లినప్పుడు 5 నిమిషాల పాటు మీటింగ్ లో ఆయనతో పోట్లాడాను..మోదీ చాలా అహంకారి. ఆందోళనల సమయంలో 500మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని నేను మోదీతో అన్నప్పుడు..నా కోసం ఏమైనా చనిపోయారా అని ప్రధాని అడిగారు. దానికి నేను అవును అని చెప్పారు.మీరు రాజు కాబట్టి అని ప్రధానితో అన్నారు. ఆ తర్వాత ఆయనతో పోట్లాట ఆపేశాను.

అమిత్ షా ను కలవాలని మోదీ చెప్పారు..నేను వెళ్లి ఆ తర్వాత షాతో కలిశాను” అని సత్యపాల్ మాలిక్ మాట్లాడినట్లు ఆ వీడియోలో కనిపిస్తోంది. ఓ కుక్క చనిపోతే..సంతాపం తెలుపుతూ ప్రధాని లేఖలు పంపారని ఈ సందర్భంగా మాలిక్ గుర్తు చేశారు. కుక్కలకు ఇచ్చిన విలువ కూడా రైతులకు మోదీ ఇవ్వలేదని పరోక్షంగా మాలిక్ వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ నేత మల్లిఖార్జున ఖర్గే ట్విట్టర్ లో షేర్ చేసిన మరో వీడియోలో సత్యపాల్ మాలిక్ మాట్లాడుతూ..”నేను అమిత్ షాను కలిసినప్పుడు సత్య మోదీకి మైండ్ పనిచేయట్లేదు. మీరు నిర్లక్ష్యంగా ఉండండి, మమ్మల్ని కలుస్తూ ఉండండి” అని కేంద్ర హోంమంత్రి చెప్పారని మాలిక్ మాట్లాడినట్లు కనిపిస్తోంది. హర్యానాలోని చక్రి దాద్రిలో ఓ పబ్లిక్ మీటింగ్ లో సత్యపాల్ మాలిక్ ఈ కామెంట్స్ చేశారు.