presidential election: రాష్ట్రప‌తి రామ్‌నాథ్ కోవింద్‌ను క‌లిసిన ప్ర‌ధాని మోదీ

రాష్ట్రప‌తి ఎన్నిక‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతోన్న వేళ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ నేడు రాష్ట్రప‌తి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిశారు. రాష్ట్రప‌తి భ‌వ‌న్‌లో వీరిద్ద‌రి మ‌ధ్య స‌మావేశం జ‌రిగింది.

presidential election: రాష్ట్రప‌తి రామ్‌నాథ్ కోవింద్‌ను క‌లిసిన ప్ర‌ధాని మోదీ

Kovind Modi

presidential election: రాష్ట్రప‌తి ఎన్నిక‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతోన్న వేళ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ నేడు రాష్ట్రప‌తి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిశారు. రాష్ట్రప‌తి భ‌వ‌న్‌లో వీరిద్ద‌రి మ‌ధ్య స‌మావేశం జ‌రిగింది. ప‌లు అంశాల‌పై వారు చ‌ర్చించారు. ఏయే అంశాలపై వారు చ‌ర్చించార‌న్న వివ‌రాలు తెలియరాలేదు. రాష్ట్రప‌తి ఎన్నిక జూలై 18న జ‌ర‌గ‌నుంది. ఈ ఎన్నిక ఫ‌లితాలను జూలై 21న వెల్ల‌డిస్తారు.

Afghan girls: తాలిబన్ల పాలనలో అగమ్యగోచరంగా అఫ్గాన్ బాలికల పరిస్థితి

ఎన్డీఏ రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా ద్రౌపది ముర్ము నామినేష‌న్ దాఖ‌లు చేసిన విష‌యం తెలిసిందే. అలాగే, విపక్ష పార్టీల రాష్ట్రపతి అభ్య ర్థి యశ్వంత్ సిన్హా కూడా గ‌త 27న నామినేష‌న్ దాఖ‌లు చేశారు. ప్ర‌స్తుతం వారిద్ద‌రు దేశంలోని రాజ‌కీయ పార్టీల‌ మ‌ద్ద‌తు కోసం ప్ర‌య‌త్నాలు కొన‌సాగిస్తున్నారు. రాష్ట్రప‌తిగా రామ్‌నాథ్ కోవింద్ 2017 జూలై 25 నుంచి కొన‌సాగుతున్నారు. ఆయ‌న ప‌ద‌వీ కాలం ఈ నెల 24తో ముగియ‌నుంది. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న‌ను ప్ర‌ధాని మోదీ క‌లిశారు.