Ameesha Patel : పవన్ కళ్యాణ్ హీరోయిన్‌పై పోలీస్ కేసు.. రివర్స్‌లో పోలీసులకి థ్యాంక్స్ చెప్పిన హీరోయిన్..

మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వాలో ఓ కార్యక్రమం కోసం ఈవెంట్ ఆర్గనైజర్లు అమీషా పటేల్‌ను సంప్రదించారు. గంటసేపు ఈవెంట్‌లో పాల్గొనేందుకు ఆమెకు డబ్బులు కూడా ఇచ్చారు. అయితే అమీషా......

Ameesha Patel :  పవన్ కళ్యాణ్ హీరోయిన్‌పై పోలీస్ కేసు.. రివర్స్‌లో పోలీసులకి థ్యాంక్స్ చెప్పిన హీరోయిన్..

Ameesha

Ameesha Patel :  పవన్ కళ్యాణ్ సరసన బద్రి సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైనా అమీషా పటేల్ ఆ తర్వాత మహేష్ బాబుతో నాని సినిమాలో కనిపించింది. బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ అప్పుడప్పుడు కొన్ని తెలుగు సినిమాల్లో కనిపించింది. ప్రస్తుతం మరికొన్ని బాలీవుడ్ సినిమాల్లో స్పెషల్ క్యారెక్టర్స్ తో అలరించనుంది. అయితే తాజాగా అమీషా పటేల్ పై పొలిసు కేసు నమోదు అయింది.

 

ఇటీవల మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వాలో ఓ కార్యక్రమం కోసం ఈవెంట్ ఆర్గనైజర్లు అమీషా పటేల్‌ను సంప్రదించారు. గంటసేపు ఈవెంట్‌లో పాల్గొనేందుకు ఆమెకు డబ్బులు కూడా ఇచ్చారు. అయితే అమీషా పటేల్ ప్రోగ్రాంకి వచ్చిన తర్వాత చాలా తక్కువ టైం మాత్రమే ఉంది. కేవలం 10 నిముషాలు ఉండగా అందులో ఒక నాలుగు నిముషాలు స్టేజిపైన కనిపించింది. ఆ తర్వాత వెంటనే వెళ్ళిపోయింది. అయితే గంటసేపు ప్రోగ్రాంకి డబ్బులు తీసుకొని కేవలం పది నిమిషాల్లోనే వెళ్లిపోయిందని ఆ ఈవెంట్ నిర్వాహకులు అమీషా పటేల్ పై చీటింగ్ కేసు నమోదు చేశారు.

Krishnaji Rao : కేజీఎఫ్ సినిమాలో అంధుడిగా కనిపించిన తాత ఎవరో తెలుసా??

 

ఈ విషయంపై అమీషా ట్విటర్‌ వేదికగా స్పందించింది. ఈ ట్వీట్ లో.. ”ఏప్రిల్‌ 23వ తేదీన మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా సిటీలో నవచండీ మహోత్సవాలకు హాజరయ్యాను. స్టార్‌ ఫ్లాష్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, అరవింద్‌ పాండే ఈ కార్యక్రమాన్ని చాలా వరస్ట్ గా నిర్వహించారు. అక్కడ నాకు కనీస సెక్యూరిటీ ఇవ్వలేదు. దీంతో నాకు ప్రాణభయం పట్టుకుంది. కానీ స్థానిక పోలీసులు నా రక్షణ బాధ్యతలు చూసుకున్నారు. వాళ్లకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అంతేకాక నేను ఇలాంటి ఈవెంట్స్ కి చాలా వెళ్తూ ఉంటాను,. ఎక్కడా ఇలాంటి చెత్త ఆర్గనైజింగ్ చూడలేదు. నేను అక్కడ గంట సేపు ఉన్నాను. నన్ను అస్సలు పట్టించుకోలేదు. దీంతో అక్కడి లోకల్ పోలీసుల సహాయంతో వెళ్ళిపోయాను. అక్కడి లోకల్ పోలీసులకి నా ధన్యవాదాలు” అంటూ పోస్ట్ చేసింది.