PM Modi : ఇక్రిశాట్ కొత్త లోగో, స్టాంప్ ను ఆవిష్కరించిన ప్రధాని మోదీ
ఇక్రిశాట్ లో కొత్త వంగడాలను ప్రధాని మోదీ పరిశీలించారు. ఇక్రిశాట్ లో ఫొటో గ్యాలరీలు, స్టాళ్లను పరిశీలించారు. ఫొటో ఎగ్జిబిషన్ సందర్శించారు.
ICRISAT new Logo and Stamp : సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులోని ఇక్రిశాట్ స్వర్ణోత్సవాలకు పీఎం మోదీ హాజరయ్యారు. ఇక్రిశాట్ కొత్త లోగో, స్టాంప్ ను మోదీ ఆవిష్కరించారు. రాపిడ్ జనరేషన్ అడ్వాన్స్ మెంట్ ఫెసిలిటీని ప్రారంభించారు. వివిధ పరిశోధనల కేంద్రాలను ప్రారంభించారు. ఇక్రిశాట్ లో కొత్త వంగడాలను పరిశీలించారు. ఇక్రిశాట్ లో ఫొటో గ్యాలరీలు, స్టాళ్లను పరిశీలించారు. ఫొటో ఎగ్జిబిషన్ సందర్శించారు. అంతకముందు ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్కు చేరుకున్నారు. గవర్నర్ తమిళిసై, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, సీఎస్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రధాని మోదీకి స్వాగతం పలికారు.
2గంటల 10 నిమిషాలకు శంషాబాద్లో ప్రధాని ల్యాండ్ అయ్యారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో పటాన్చెరులోని ఇక్రిశాట్కు మోదీ వెళ్లారు. ఇక్రిశాట్ సర్వోర్ణత్సవాల్లో పాల్గొన్నారు. అనంతరం.. ఆ సంస్థ కొత్త లోగోను ప్రధాని ఆవిష్కరించారు. అక్కడి నుంచి నాలుగున్నర గంటలకు తిరిగి శంషాబాద్కు ప్రధాని చేరుకుంటారు. 4 గంటలకు ముచ్చింతల్కు చేరుకుని పది నిమిషాల పాటు రెస్ట్ తీసుకుంటారు. సాయంత్రం ఏడు గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ శ్రీరామనగరంలో ఏర్పాటు చేసిన సమతామూర్తి రామానుజాచార్యుల విగ్రహాన్ని లోకార్పణం చేస్తారు.
Mumbai : ముంబైలో ట్రాఫిక్ రద్దీ వల్లే..దంపతులు విడాకులు తీసుకుంటున్నారు : మాజీ సీఎం భార్య వ్యాఖ్యలు
శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ఇక్రిశాట్ వెళ్లారు. ఆకలితో అలమటించే నిరుపేదలకు ఆహార భద్రతనిచ్చే లక్ష్యంతో ఏర్పాటైన ఇక్రిశాట్కు నేటికి 50 ఏళ్లు. ఆసియా, ఆఫ్రికా ఖండాల్లోని చాలా దేశాల్లో సాగునీటి కొరతతో సరిగ్గా పంటలు పండవు. వారందరికి ఆహార భద్రతనిచ్చే దిశగా ఇక్రిశాట్లో పరిశోధనలు జరుగుతున్నాయి. ఆసియా, ఆఫ్రికాలోని 210 కోట్ల మంది ప్రజలకు ఇక్రిశాట్ సేవలందిస్తోంది.
1972లో అంటే 50 ఏళ్లక్రితం రెండు ఫౌండేషన్లు భారత ప్రభుత్వ సహకారంతో హైదరాబాదుకు సమీపంలోని పటాన్చెరులో ఇక్రిశాట్ను ఏర్పాటు చేశాయి. అధిక దిగుబడినిచ్చే 1,135 రకాల కొత్త వంగడాలను ఇప్పటిదాకా ఇక్రిశాట్ 81 దేశాలకు పంపిణీ చేసింది. మొత్తం 149 దేశాల్లో 15 లక్షలకు పైగా విత్తన నమూనాలను రైతులకు అందించింది. ప్రపంచవ్యాప్తంగా 144 దేశాలకు చెందిన వివిధ రకాల పంటలు, వంగడాలకు చెందిన లక్షా 28 వేలకు పైగా జన్యువులను భవిష్యత్తు ఆహార భద్రతకోసం ఇక్రిశాట్ జన్యు బ్యాంకులో భద్రపరచింది.
Husband For Sale: మొగుడ్ని వేలానికి పెట్టిన భార్య, కొనుకుంటామంటూ వచ్చిన 12 మంది మహిళలు
మొజాంబిక్, టాంజానియా, జింబాబ్వే వంటి పేదదేశాల్లో ఈ సంస్థ శాస్త్రవేత్తలు చేపట్టిన కార్యక్రమాల కారణంగా పంటల దిగుబడి 28 శాతం నుంచి 313 శాతం దాకా పెరిగింది. పలుదేశాల్లోని రైతులకు ఇచ్చిన శిక్షణలతో పంటలకు వాడే సాగునీటి వినియోగాన్ని 40-85శాతం మేర తగ్గించారు. భారత ప్రభుత్వం, ఇక్కడి జాతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థలు అందిస్తున్న సహకారంతో దేశీయ రైతులతో కలిసి ఇక్రిశాట్ ప్రయోగాలు చేస్తోంది. ఇక్కడి నాణ్యమైన విత్తనాలను ఆఫ్రికా ఖండంలోని 13 దేశాల్లో అందించి సాగుచేయించి ఎన్నో సత్ఫలితాలు సాధించింది.
తద్వారా నిరుడు ఇక్రిశాట్కు ఆఫ్రికా ఫుడ్ పురస్కారం కూడా దక్కించుకుంది. సైన్స్ విత్ హ్యుమన్ ఫేస్ నినాదంతోనే ముందుకు వెళుతుంది ఇక్రిశాట్. మొత్తం 3 వేల 434 ఎకరాల్లో విస్తరించి ఉంది ఈ సంస్థ. మామాలుగా ఒక కొత్త వంగడం రూపొందించడానికి దశాబ్ధ కాలం పడుతుంది. కానీ ర్యాపిడ్ జెన్ కేంద్రం ఏర్పాటు చేసిన ఇక్రిశాట్.. ఏడాదిన్నరలోనే కొత్త వంగడాలను అభివృద్ధి చేస్తుంది.. ఇలా నిరంతర కృషితో దూసుకుపోతున్న ఇక్రిశాట్ నేడు స్వర్ణోత్సవాలను జరుపుకుంటుంది.