కదులుతున్న రైలు ఎక్కబోయిన దివ్యాంగుడు, తర్వాత..వీడియో వైరల్

కదులుతున్న రైలు ఎక్కబోయిన దివ్యాంగుడు, తర్వాత..వీడియో వైరల్

Railway Protection Force : కదులుతున్న రైలు ఎక్కబోయి ఎంతో మంది ప్రమాదాల బారిన పడుతుంటారు. ఇందులో కొంతమంది ప్రాణాలు కోల్పోతుంటారు కూడా. తాజాగా…ఓ దివ్యాంగుడు కదులుతున్న రైలు ఎక్కబోయి..దాదాపు చావు అంచుకు పోయాడు. ఓ రైల్వే పోలీసు అతని ప్రాణాలు కాపాడాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

దివ్యాంగుడి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ పై ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. Panvel station. శుక్రవారం మధ్యాహ్న సమయంలో ఓ రైలు వెళుతోంది. ఫ్లాట్ ఫాం 07 నెంబర్ మీదుగా వెళుతున్న ఈ రైలును ఎక్కేందుకు ఓ దివ్యాంగుడు ప్రయత్నించాడు. రైలులో ఎక్కిన అతను అతనికి సహాయ పడ్డాడు. కానీ..కాలు జారిపోవడం..రైలు వేగం ఎక్కువ కావడంతో…ప్లాట్ ఫాం..రైలు మధ్య పడిపోతున్నాడు.

వెంటనే ఓ విధుల్లో ఉన్న రైల్వే పోలీసు అలర్ట్ అయ్యాడు. అతడి చేయిని పట్టుకుని..పక్కకు లాగాడు. దీంతో అతను కిందపడిపోయాడు. తర్వాత..దివ్యాంగుడిని పోలీసులు చేరదీశారు.