Rajasthan : ఆవు పాలు తక్కువ ఇస్తోందని..ఒంటె గొంతు కోసి ఇంటిముందు పాతిపెట్టిన వ్యక్తి
ఓ డైరి నిర్వాహకుడు ఆవు పాలు తక్కువ ఇస్తోందని ఒంట తల నరికి ఇంటిముందు పాతిపెట్టిన ఘటన రాజస్థాన్ లో కలకలం రేపింది. దీనికి కారణం మంత్ర విద్యేనని పోలీసులు విచారణలో తేలింది.దీంతో నలుగురు వ్యక్తుల్ని అరెస్ట్ చేసారు పోలీసులు.
Camel neck cut for witchcraft : రాజస్థాన్ అంటే ఠక్కున గుర్తుకొచ్చేవి కోటలు..పర్యాటక ప్రదేశాలు..అక్కడి ఎడారుల్లో ఒంటెలు. రాజస్థాన్ రాష్ట్ర జంతువు ఒంటె. అటువంటి ఒంటెను ఓ రైతు గొంతు కోసి చంపిన ఘటన ఉదయపూర్లో చోటుచేసుకుంది. సూరజ్పోల్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఓఒంటె తల నరికిన మొండెం కనిపించటంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపై స్థానికులు ఇచ్చిన సమాచారంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన పోలీసులు దర్యాప్తు చేయగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఒంటెను చంపిన ఘటనలో నలుగురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు దర్యాప్తు చేయగా..మూఢనమ్మకల మాయలో పడి ఓ రైతు ఈ దారుణానికి ఒడిగట్టినట్లుగా తెలిసింది. మంత్రగాడి మాయమాటలు నమ్మిన ఓ రైతు తన ఒంటె మెడ నరికినట్లుగా సూరజ్పోల్ పోలీసులు గుర్తించారు.
దీనిపై సూరజ్పోల్ పోలీస్ అధికారి హనుమంత్ సింగ్రాజ్ పురోహిత్ మాట్లాడుతూ.. గోవర్ధన్ విలాస్ ప్రాంతంలో రాజేష్ అహిర్ అనే వ్యక్తి డెయిరీ నడుపుతున్నాడు. రాజేష్ అహీర్ కు 30కి పైగా ఆవులు ఉన్నాయి. అవి ఇచ్చే పాలతో పాటు స్థానికుల పాలను కూడా కొని డైరీ నడుపుతుంటాడు. ఈక్రమంలో రాజేష్ కు ఉన్న ఆవుల్లో ఓ ఆవు అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో పాలు కూడా గతంలో కంటే తక్కువగా ఇస్తోంది. ఆవుకు అనారోగ్యంగా ఉండటంవల్లే పాలు తక్కువ ఇస్తోందని గుర్తించని రాజేష్ తనకు తెలిసిన చేతన్ అనే వ్యక్తికి ‘మా ఆవుల్లో ఓ ఆవు ఈ మధ్య సరిగా పాలు ఇవ్వట్లేదు’ అని చెప్పాడు. దానికి రాజేష్ మంత్ర విద్యతో నీ ఆవును ఎక్కువ పాలు ఇచ్చేలా చేయొచ్చు అని చెప్పాడు. అది నమ్మిన రాజేష్ ను తన తండ్రి శోభాలాల్ కు పరిచయం చేశాడు. శోభాలాల్ మంత్ర తంత్రాలు చేస్తుంటాడు.
విషయం విన్న శోభాలాల్ ‘ఓ ఒంటె తల నరికి దానిని ఇంటి బయట పాతిపెడితే సమస్య పరిష్కారమవుతుందని..నీ ఆవు తిరిగి ఎక్కువ పాలు ఇస్తుంది’ అని చెప్పాడు. ఆ మాటలు విన్న రాజేష్ ఏమాత్రం ఆలోచించలేదు. తన స్నేహితులు రఘునాథ్, చేతన్ లతో సహా మరో ఇద్దరు స్నేహితుల సహాయంతో ఓ ఒంటె మెడను నరికారు..ఆ తరువాత దాన్నిని రాజేష్ తన ఇంటిముందు పాతిపెట్టాడు. ఈక్రమంలో తన లేని ఒంటె మొండాన్ని చూసిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టగా అసలు విషయం బయటపడింది. దర్యాప్తులో భాగంగా పోలీసులు ఒక వ్యక్తి అందిన సమాచారంతో రాజేష్ ఇంటి చుట్టుపక్కల గాలించగా ఒంటె తల పాతిపెట్టి కనిపించాయి.
దీనికి సంబంధించి తగిన ఆధారాలు లభించటంతో పోలీసులు రాజేష్ కు సహకరించిన నలుగురు నిందుతులు నిందితులు రాజేష్ అహిర్, శోభాలాల్, చేతన్, రఘువీర్ సింగ్ లను అరెస్టు చేశారు.వీరిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం ఒప్పుకున్నారు. కాగా నిందితులు ఇచ్చిన సమాచారంతో ఒంటెకు బెల్లం..ఇంకా పశుగ్రాసం ఇచ్చి ఒంటెను మచ్చిక చేసుకుని ఆ తరువాత దాని తల నరికినట్లుగా తేలింది.