Ram Charan: ముంబై వీధుల్లో రామ్ చరణ్.. ఎందుకు వెళ్లినట్లో?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఏం చేసినా దాని వెనక ఏదో స్కెచ్ ఉంటుంది. పక్కా ప్లాన్ ఉంటుంది. రిలీజ్ కు రెడీగా ఉన్న త్రిబుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్ చేతిలో మరో రెండు సినిమాలు అండర్..

Ram Charan: ముంబై వీధుల్లో రామ్ చరణ్.. ఎందుకు వెళ్లినట్లో?

Ram Charan

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఏం చేసినా దాని వెనక ఏదో స్కెచ్ ఉంటుంది. పక్కా ప్లాన్ ఉంటుంది. రిలీజ్ కు రెడీగా ఉన్న త్రిబుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్ చేతిలో మరో రెండు సినిమాలు అండర్ ప్రొడక్షన్ లో ఉన్నాయి. ఈ బిజీ షెడ్యూల్ లోతో ఉన్న చెర్రీ ఎందుకు ఈ మధ్య ముంబైలోనే ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తున్నాడు? క్యాజువల్ గానే వెళ్తున్నాడా లేక అక్కడ ఏమైనా సినిమా ప్లాన్ చేస్తున్నాడా? ఇలాంటి డౌట్స్ కి క్లారిఫికేషన్ రావాలంటే డిటైల్డ్ స్టోరీలోకి ఎంటరవ్వాలి.

Bheemla Nayak: ఏపీ ప్రభుత్వ సానుకూలం.. భీమ్లా ముహూర్తం ఫిక్స్ అయినట్లేనా?

త్రిబుల్ ఆర్, ఆచార్య రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసుకున్నాయి ఆ ప్రమోషన్స్ ఒకపక్క.. మరోపక్క శంకర్ కాంబినేషన్ లో సినిమా షూటింగ్ రాజమండ్రిలో జరగనుంది. ఇంత బిజీ షెడ్యూల్ లో కూడా ఈ నెలలో నాలుగు సార్లు ముంబై వెళ్లాడు రామ్ చరణ్. ఒకసారి తన చెల్లెలు శ్రీజతో వెళ్తే, రెండోసారి ముంబాయ్ లోని రానా ఇంట్లో కనిపించాడు. రీసెంట్ గా తన వైఫ్ ఉపాసనతో ఓ రెస్టారెంట్ లో దర్శనమిచ్చిన చరణ్, లేటెస్ట్ గా మనీష్ మల్హోత్రా ఆఫీస్ లో ఫామిలీతో కలసి మీడియాకి చిక్కాడు.

Saniya Iyappan: హీరోయిన్ ఆరుబయట స్నానం.. నెటిజన్ల ఆగ్రహం!

ఇన్నిసార్లు మీడియా కంటబడ్డ చరణ్ సీక్రెట్ గా ఎన్ని మీటింగ్స్ లో పాల్గొంటున్నాడో అనే డౌట్ రేజ్ చేస్తున్నారు కామన్ ఆడియన్స్. గతంలో ముంబయిలో ఇల్లు కూడా కొనుక్కున్న రామ్ చరణ్ అక్కడి బిజినెస్ పనుల్లో బిజీగా ఉంటున్నారు. అయినా, ముంబాయిలో సినీ సెలబ్రిటీస్ తో రెగ్యులర్ టచ్ లో ఉంటున్నాడు. ట్రేడ్ సర్కిల్ తో కూడా చెర్రీకి మంచి సంబంధాలే ఉన్నాయి. బాలీవుడ్ లో తన మార్కెట్ ను పెంచుకునే ప్లాన్ చేస్తున్నాడా అంటే, అవుననే అంటున్నారు అక్కడి సినీ విశ్లేషకులు.

Son of India: లాంగ్ గ్యాప్ తర్వాత మోహన్ బాబు.. ట్రైలర్ ఎప్పుడంటే?

ఆల్రెడీ బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ సినిమా జంజీర్ నిరాశే మిగిల్చింది. కాని, ఇప్పుడు లార్జ్ స్కేల్ లో వస్తోన్న త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ రానుందని బలంగా నమ్ముతున్నాడు చెర్రీ. ఆ క్రేజ్ ను, ఇమేజ్ ను కంటిన్యూ చేస్తూ ఇప్పుడు చేయబోయే వన్నీ పాన్ ఇండియా రేంజ్ సినిమాలే ప్లాన్ చేసి, క్యాష్ చేసుకోవాలనుకుంటున్నాడు. అందుకే శంకర్ తో చేయబోయే రామ్ చరణ్ 15వ సినిమా, గౌతమ్ తిన్ననూరితో చేయబోయే 16వ సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్ సినిమాలే ప్లాన్ చేసుకున్నాడు చెర్రీ.

Nagarjuna- Jr NTR: సీఎం జగన్‌తో భేటికి నాగార్జున, ఎన్టీఆర్ గైర్హాజరు.. కారణం ఏంటంటే?

తన మార్కెట్ ను బాలీవుడ్ లో కూడా పెంచుకోవాలంటే, ఇప్పటి నుండే తనకోసం పనిచేసే స్టాఫ్ ను, ఆఫీస్ ను అక్కడా ఏర్పాటు చేసుకోవాలని ఫిక్సయ్యాడు. ఎస్పెషల్లీ డిజిటల్ టీమ్ ను కూడా రిక్రూట్ చేసుకుని, తనకు సంబంధించిన అప్ డేట్స్ అన్నీ స్ర్పెడ్ చేయాలనే ప్లాన్ తో ఉన్నాడట మెగా పవర్ స్టార్. ఈ క్రమంలోనే ముంబయి సినీ పెద్దలను కలుస్తూ, ఓ స్పెషల్ సెటప్ నే సెట్ చేసే పనిలో బిజీగా ఉన్నట్టు సమాచారం. ముంబయి నుంచి రాగనే రాజమండ్రిలో జరగనున్న శంకర్ సినిమా లాంగ్ షెడ్యూల్ లో బిజీ కానున్నాడు చరణ్ తేజ్.