Chicken Prices : రష్యా-యుక్రెయిన్ యుద్ధం ఎఫెక్ట్.. తెలంగాణలో భారీగా పెరిగిన చికెన్ ధరలు!

Chicken Prices : రష్యా, యుక్రెయిన్ మధ్య యుద్ధం కారణంగా తెలంగాణలో చికెన్ ధరలు భారీగా పెరిగిపోయాయి. ఎక్కడో జరిగే యుద్ధానికి మన తెలంగాణలో చికెన్ ధరలకు సంబంధం ఏంటి అనుకుంటున్నారా?

Chicken Prices : రష్యా-యుక్రెయిన్ యుద్ధం ఎఫెక్ట్.. తెలంగాణలో భారీగా పెరిగిన చికెన్ ధరలు!

Chicken Prices Russia Ukraine War Triggers Rise In Chicken Prices In Telangana

Chicken Prices in Telangana : రష్యా, యుక్రెయిన్ మధ్య యుద్ధం కారణంగా తెలంగాణ రాష్ట్రంలో చికెన్ ధరలు (Chicken Prices in Telangana) భారీగా పెరిగిపోయాయి. అదేంటీ.. ఎక్కడో రష్యా, యుక్రెయిన్ మధ్య యుద్ధానికి మన తెలంగాణలో చికెన్ ధరలకు సంబంధం ఏంటి అనుకుంటున్నారా? అవును సంబంధం ఉంది.. యుక్రెయిన్‌పై రష్యా దాడితో ప్రత్యక్షంగా కాకపోయినా.. పరోక్షంగా తెలంగాణలో చికెన్ ధరలు పెరగడానికి కారణమైంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ దయవల్ల.. మీ డైనింగ్ టేబుల్‌పై చికెన్ కర్రీ కాస్త ఖరీదైనదిగా మారిపోయింది. రాష్ట్రంలో చికెన్ కిలో రూ. 280కి అమ్ముడవుతోంది. అదే గత నెలలో చికెన్ కిలో ధర రూ.180 ధర పలికింది. దేశవ్యాప్తంగా కోళ్ల దాణా ధరలు పెరగడం కూడా చికెన్ ధర పెరగడానికి ఒక కారణమని కోళ్ల పెంపకందారులు చెబుతున్నారు. కోళ్ల పెంపకానికి మొక్కజొన్న, సోయాబీన్ ఎక్కువగా ఫీడ్‌ కావాల్సి ఉంటుంది. కొన్ని వారాల క్రితం రూ. 40 ఉన్న కిలో సోయాబీన్ ఇప్పుడు రూ. 70 పలికింది.. మొక్కజొన్న కిలో ధర రూ. 20 ఉండగా.. ఇప్పుడు రూ. 27 పలుకుతోంది. ఇంకా కిలో మొక్కజోన్న రూ. 30కి పెరుగుతుందని అంచనా.

యుక్రెయిన్‌లో యుద్ధం నేపథ్యంలో వీటికి భారీగా గిరాకీ పెరిగిపోయింది. ఇప్పటివరకూ ఈ ఉత్పత్తులను మన దేశంలో సరఫరా చేసిన రైతులు (Farmers from India) విదేశాల్లో డిమాండ్ రీత్యా ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. అందులో మొక్కజొన్న, సోయాబీన్‌లను అధికంగా ఎగుమతి చేస్తున్నారు. వాస్తవానికి.. సోయాబీన్, మొక్కజొన్నలను అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశాల్లో యుక్రెయిన్ ఒకటిగా చెప్పవచ్చు. అక్కడ కొనసాగుతున్న సంక్షోభం కారణంగా ఆ దేశం నుంచి ఎగుమతులు దెబ్బతిన్నాయి.

Chicken Prices Russia Ukraine War Triggers Rise In Chicken Prices In Telangana (1)

Chicken Prices Russia Ukraine War Triggers Rise In Chicken Prices In Telangana

ఈ నేపథ్యంలో ఆయా కంపెనీలు సోయాబీన్, మొక్కజొన్న ఎగుమతుల కోసం భారతీయ మార్కెట్‌పై ఒత్తిడి తీసుకుస్తున్నాయని వెంకటేశ్వర హేచరీస్ జనరల్ మేనేజర్ కేజీ ఆనంద్ పేర్కొన్నారు. ఈ వేసవిలో వచ్చే కొన్ని నెలల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని కోళ్ల పెంపకందారుల సంఘం అభిప్రాయపడుతోంది. ఎందుకంటే.. వేసవిలో కోళ్లు ఎక్కువగా చనిపోతుంటాయి. దీనికి తోడు కరోనా మహమ్మారి లాక్‌డౌన్ల కారణంగా కోళ్ల పరిశ్రమకు భారీ నష్టం కలిగింది. ప్రస్తుతం కోళ్ల దాణా ధరలు పెరగడం కూడా ధరల పెరుగుదలకు కారణమని తెలంగాణ పౌల్ట్రీ బ్రీడర్స్ అసోసియేషన్ సభ్యుడు ఒకరు తెలిపారు.

చికెన్ ధరల పెరుగుదల (Chicken Prices in Telangana) నగరంలోని హోటళ్ల వ్యాపారులను కూడా భారీగా దెబ్బతీసిందనే చెప్పాలి. అయినప్పటికీ లాభ-నష్టంతో సంబంధం లేకుండా చికెన్ వంటకాలను సిద్ధం చేసి పంపిణీ చేస్తున్నామని, కొన్ని హోటళ్లు తమ చైనీస్ ఫాస్ట్‌ఫుడ్ అవుట్‌లెట్‌లను కూడా మూసివేశాయని టోలిచౌకిలోని షా ఘౌస్ హోటల్ యజమాని మొహమ్మద్ ఇర్ఫాన్ అన్నారు. పాతబస్తీకి చెందిన మహ్మద్ షాహెద్ హుస్సేన్, చేపలు, మటన్ ధరల పెరుగుదల తరువాత ప్రజలు చికెన్‌ను ఇష్టపడుతున్నారని అన్నారు. కరోనా పరిస్థితుల్లో చాలామంది రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు చికెన్ ఎక్కువగా తినేందుకు ఆసక్తి చూపిస్తున్నారని అంటున్నారు. అయితే ప్రస్తుతం చికెన్ ధరలు కొండెక్కడంతో.. మధ్యతరగతి కుటుంబాలకు కూడా చికెన్ అందుబాటులో లేని పరిస్థితి ఎదురవుతోందని చెబుతున్నారు.

Read Also : Ukriane Victory : రష్యాపై విజయం సాధించాం-జెలెన్ స్కీ ఆనందం