Bandi Sanjay : అక్కడ కచ్చితంగా బీజేపీ గెలుస్తుంది, తెలంగాణ సచివాలయంలో మార్పులు చేస్తాం-బండి సంజయ్

Bandi Sanjay : హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా నిర్మించిన సెక్రటేరియట్ లోకి అడుగుపెట్టను. తెలంగాణకు ఎవరిని సీఎం చేసేదీ పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుంది.

Bandi Sanjay : అక్కడ కచ్చితంగా బీజేపీ గెలుస్తుంది, తెలంగాణ సచివాలయంలో మార్పులు చేస్తాం-బండి సంజయ్

Bandi Sanjay

Bandi Sanjay : కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు, తెలంగాణ నూతన సచివాలయంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. కర్ణాటకలో కచ్చితంగా బీజేపీ గెలుస్తుందని బండి సంజయ్ జోస్యం చెప్పారు. అక్కడ యువత నుంచి బీజేపీకి అనూహ్య స్పందన వస్తోందన్నారు. బీజేపీ రాకపోతే అభివృద్ధి ఆగిపోతుందన్న భావన కర్నాటక ఓటర్లలో ఉందన్నారు.

కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేశారు బండి సంజయ్. కాంగ్రెస్ పార్టీ గల్లీలో లేదు, ఢిల్లీలో లేదు అని అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదని జోస్యం చెప్పిన బండి సంజయ్.. కాంగ్రెస్ వి వృథా ప్రయాసలు అన్నారు. కర్నాటకలో బొట్టు తుడుచుకుంటే అధికారం రాదని, బొట్టు పెట్టుకుంటే వస్తుందని బండి సంజయ్ అన్నారు. ఎవరి సంప్రదాయాలు వారు పాటిస్తారని, దానిని కూడా కొందరు అవమానిస్తున్నారని మండిపడ్డారు.

Also Read..Revanth Reddy : ఓఆర్ఆర్ ను 30 ఏళ్లకు రూ.7,380 కోట్లకు అమ్మేసిన కేసీఆర్ : రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై నిప్పులు చెరిగారు బండి సంజయ్. కేసీఆర్ డబ్బు దోచుకున్నారని ఆరోపించారు. నూతన సచివాలయ భవనం ప్రారంభానికి ఆహ్వానం వచ్చినా వెళ్లము అని బండి సంజయ్ తేల్చి చెప్పారు. ఒవైసీ కళ్లలో ఆనందం చూడాలని కేసీఆర్ అనుకుంటున్నారని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.

ఓ వర్గం ఓట్ల కోసం సచివాలయ భవనం నిర్మాణ విధానం సాగిందని విమర్శించారు. తెలంగాణ సంస్కృతికి వ్యతిరేకంగా సచివాలయం నిర్మించారన్న బండి సంజయ్.. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే సచివాలయం భవనంలో మార్పులు చేస్తామన్నారు. ఒక హిందూ దేవాలయాన్ని కూల్చి, మసీదుకు స్థలం ఇస్తారని ఆరోపించారు. తెలంగాణలో ఎవరు ముఖ్యమంత్రి కావాలన్నది పరిస్థితులు నిర్ణయిస్తాయన్నారు బండి సంజయ్.

Also Read..Karnataka Polls: బీజేపీకి ప్రతిష్టాత్మకంగా కర్ణాటక ఎన్నికలు.. కాంగ్రెస్‌కు అసలైన సవాల్‌ అదే..

”నూతన సచివాలయ భవనం ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందినా వెళ్లను. హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా నిర్మించిన సెక్రటేరియట్ లోకి అడుగుపెట్టను. సచివాలయం నిర్మాణంలో హిందువుల వాటా రెండు గుంటలు మాత్రమే. కర్నాటకను కాంగ్రెస్ పార్టీ ఏటీంగా వాడుకుంటోంది. తెలంగాణకు ఎవరిని సీఎం చేసేదీ పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుంది” అని బండి సంజయ్ అన్నారు.