Telangana Vaccine : తెలంగాణాలో దీపావళి రోజు వాక్సిన్‌కు హాలిడే..

దీపావళి పండగ సందర్భంగా తెలంగాణ లో రేపు వాక్సినేషన్ కు ఆరోగ్యశాఖ సెలవు ప్రకటించింది. వైద్య సిబ్బందికి దీపావళి రోజున సెలవు ప్రకటించింది.

Telangana Vaccine : తెలంగాణాలో దీపావళి రోజు వాక్సిన్‌కు హాలిడే..

Diwali Day..holiday

Telangana Vaccine : దీపావళి పండగ సందర్భంగా తెలంగాణ లో రేపు (నవంబర్ 4,2021) వాక్సినేషన్ కు ఆరోగ్యశాఖ సెలవు ప్రకటించింది. దీపావళి పండగ సందర్భంగా నవంబర్ 4న వాక్సినేషన్ కార్యక్రమానికి విరామం ఇచ్చారు. దీంతో గురువారం అంటే దీపావళి రోజున కోవిడ్ వాక్సినేషన్ ఇస్తున్న వైద్య సిబ్బంది విరామం దొరికింది. ఒక్కరోజు వ్యాక్సినేషన్ కు సెలవు దొరికింది. కానీ శుక్రవారం నుంచి తిరిగి యధావిధిగా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుందని వైద్య అధికారులు వెల్లడించారు. అలాగే దీపాలు వెలిగిస్తున్న సమయంలో శానిటైజర్స్ ఉపయోగించవద్దని వైద్య అధికారులు ప్రజలకు సూచించారు.

Read more : Diwali : దీపావళిరోజు ఆడపడుచులు హారతి ఇవ్వటం వెనుక అసలు కధేంటంటే?…

కాగా తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ చాలా తగ్గింది. కేసులు నమోదు తగ్గటంతో సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టింది. కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి ఉదృతి తగ్గి స్థిరంగా కొనసాగుతోంది. ఒక్కోరోజు కేసుల నమోదులో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. ఓరోజు ఎక్కువగా నమోదవుతుంటే మరోరోజు చాలా తక్కువగా నమోదు అవుతున్నాయి.అక్టోబర్ లోనే థర్డ్ వేవ్ వస్తుందని అధికారులు అంచనాలు వేశారు. కానీ అటువంటి ఛాయలేవీ కనిపించకపోవటంతో అటు అధికారులు, ఇటు ప్రజలు కాస్త ఊపిరి తీసుకున్నారు. ఈ క్రమంలో ఇక థర్డ్ వేవ్ ప్రమాదం ఉండదనే ప్రజలు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. మరోపక్క తెలంగాణ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుండటంతో కేసులు బాగా తగ్గుముఖం పట్టాయి. దీంతో ప్రజలు చాలా రోజుల క్రితమే కరోనా గురించి ఆందోళన చెందటం మానివేసి సంతోషంగా ఉన్నారనే చెప్పాలి.

Read more : Dhanteras: ధన్‌తేరాస్ స్పెషల్, మేకింగ్ ఛార్జీలు లేవు.. వెయ్యి రూపాయల గిఫ్ట్ వౌచర్

ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ టీకా ఇచ్చే దిశగా చర్యలు వేగవంతం చేసింది. కోవిడ్‌ వ్యాక్సిన్‌ విషయంలో ప్రజలను చైతన్య పరిచేలా ప్రభుత్వ పటు చర్యలు చేపట్టింది. ఇప్పటికే మొబైల్ వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా కొనసాగిస్తోంది.ప్రస్తుతం కరోనా నివారణ కోసం శానిటైజర్ లేని ఇల్లు లేదు. ఈక్రమంలో గత ఏడాది దీపావళి కంటే ఈ ఏడాది దీపావళిని ప్రజలకు కాస్త ఘనంగా చేసుకునే అవకాశముంది. అలాగే పలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీపావళి పండగ సందర్భంగా దీపాలను, బాణాసంచా వెలిగించే ముందు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది. ముఖ్యంగా చేతులకు శానిటైజర్లను ఉపయోగించవద్దని సూచించారు. శానిటైజర్లలోని ఆల్కహాల్ కు మండే గుణం ఉంటుంది కనుక దీపావళిరోజున దీపాలు వేగిస్తున్న సమయంలో క్రాకర్స్ కలుస్తున్న సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని .. ప్రజలకు వైద్య శాఖ  సూచించింది.