Revanth Reddy Yatra : మేడారం నుంచే ఈ యాత్ర మొదలుపెట్టడానికి ఓ కారణం ఉంది: రేవంత్ రెడ్డి

రాహుల్ గాంధీ సందేశం స్ఫూర్తిగా హాథ్ సే హాథ్ జోడో యాత్ర నిర్వహించాలని ఏఐసీసీ ఆదేశించిందని చెప్పారు. మేడారం నుంచే ఈ యాత్ర మొదలుపెట్టడానికి ఒక కారణం ఉందని అన్నారు.

Revanth Reddy Yatra : మేడారం నుంచే ఈ యాత్ర మొదలుపెట్టడానికి ఓ కారణం ఉంది: రేవంత్ రెడ్డి

Revanth Reddy Yatra : కులాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి బీజేపీ అధికారాన్ని పదిలం చేసుకోవాలనుకుంటోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. త్యాగాల పునాదులపై కాంగ్రెస్ పార్టీ ఏర్పడిందని, అందుకే ప్రాణాలకు తెగించి దేశ సమగ్రతను కాపాడేందుకు రాహుల్ గాంధీ పాదయాత్ర చేశారని ఆయన చెప్పారు.

ములుగు జిల్లాలోని మేడారంలో సమ్మక్క-సారలమ్మలకు మొక్కులు చెల్లించుకున్న అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాహుల్ గాంధీ సందేశం స్ఫూర్తిగా హాథ్ సే హాథ్ జోడో యాత్ర నిర్వహించాలని ఏఐసీసీ ఆదేశించిందని చెప్పారు. మేడారం నుంచే ఈ యాత్ర మొదలుపెట్టడానికి ఒక కారణం ఉందని అన్నారు.

Also Read..#Telanganabudget: ఏనుగు తొండమంత నిధులు చూపించి, ఎలుక తోకంత విడుదల చేస్తున్నారు: బీజేపీ నేతల విమర్శలు

సమ్మక్క సారలమ్మ వనదేవతలని, నమ్మిన ప్రజల కోసం రాచరికాన్ని ఎదిరించి చివరి రక్తపు బొట్టు వరకు పోరాడారని చెప్పారు. అందుకే ఆ అమ్మల ఆశీర్వాదంతో పోరాటానికి సిద్ధమయ్యామని తెలిపారు. కేంద్రం, రాష్ట్రంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇష్టారాజ్యాంగ వ్యవహరిస్తున్నారని బీజేపీ, బీఆర్ఎస్ నేతలపై ఆయన విమర్శలు గుప్పించారు.(Revanth Reddy Yatra)

మేడారంలో పడ్డ తొలి అడుగు పాదయాత్ర కోసం కాదని, కేసీఆర్ ప్రభుత్వాన్ని పాతాళానికి తొక్కడానికేనని చెప్పారు. వైఎస్సార్ అప్పట్లో చేవెళ్ల చెల్లెమ్మ సెంటిమెంట్ తో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చారని అన్నారు. సమ్మక్క సారలమ్మ సాక్షిగా ఎమ్మెల్యే సీతక్క హారతి ఇచ్చి స్వాగతం పలికారంటే ఈ యాత్ర విజయవంతం అయినట్లేనని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూస్తుంటే బొందపెట్టిన రాచరికం మళ్లీ పుట్టినట్టు అనిపిస్తోందని తెలిపారు.

Also Read..Ponguleti Srinivasa Reddy: శీనన్న ఒక్కడు కాదు.. బెదిరిస్తే వడ్డీతో సహా చెల్లిస్తాం

తెలంగాణ కోసం అమరులైన వారి ఆత్మ ఘోష ఇంకా వినిపిస్తోందని చెప్పారు. అమరుల త్యాగాలను ఈ ప్రభుత్వం మట్టితో కప్పాలని చూస్తోందని అన్నారు. సమ్మక్క సారలమ్మ పోరాడిన గడ్డ ఇది.. సాయుధ రైతాంగ పోరాటంలో నైజాం సర్కారును గడగడలాడించిన గడ్డ ఇది. అప్పుల బాధతో రైతులు పురుగుల మందు తాగి చనిపోవడం సంక్షేమమా? నోటిఫికేషన్ల వేయకుండా తొమ్మిదేళ్లు ప్రభుత్వం కాలయాపన చేసింది.(Revanth Reddy Yatra)

ఉద్యోగాలు రాక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవడం సంక్షేమమా? విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వకుండా పెదలను విద్యకు దూరం చేయడం సంక్షేమమా? డబుల్ బెడ్రూం ఇళ్లు ఎవరికైనా వచ్చాయా? రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ జరిగిందా? 25 లక్షల కోట్లు ఎటు పోయాయి? ఆ సొమ్ము రాబందుల సమితి దోచుకుంది వాస్తవం కాదా?

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

తెలంగాణలో 10శాతం ఉన్న పెట్టుబడి దారులకు మాత్రమే కేసీఆర్ లాభం చేకూర్చారు. తెలంగాణను బొందలగడ్డగా మార్చింది కేసీఆర్ కాదా? రైతులు, నిరుద్యోగులకు, విద్యార్థులకు, బలహీన వర్గాల జీవితాల్లో మార్పు కోసమే ఈ యాత్ర. రాష్ట్రంలో మార్పు రావాలంటే కేసీఆర్ అధికారం పోవాలి. కేసీఆర్ ను గద్దె దింపితేనే రాష్ట్రంలో మార్పు వస్తుంది అని రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు.