Revanth Reddy : కల్వకుంట్ల అవినీతికి బలై పోయిన నందిపేట సెజ్ : రేవంత్ రెడ్డి

నందిపేట సెజ్ కల్వకుంట్ల అవినీతికి బలై పోయిందని విమర్శించారు. కేసీఆర్ ఆర్భాటపు ప్రకటనల్లో నిజం లేదని వెల్లడించారు. ఇక్కడ ఎలాంటి పనులు జరగడం లేదని.. అభివృద్ధి జరగడం లేదని విమర్శించారు.

Revanth Reddy : కల్వకుంట్ల అవినీతికి బలై పోయిన నందిపేట సెజ్ : రేవంత్ రెడ్డి

Revanth Reddy (1)

Revanth Reddy : నందిపేట సెజ్ కల్వకుంట్ల అవినీతికి బలై పోయిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. 2008లో నందిపేట స్మార్ట్ ఆగ్రో ఫుడ్ పార్క్ కు యూపీఏ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. 421 ఎకరాల భూమిని సేకరించి పరిశ్రమల కోసం సెజ్ ను ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. ఇందులో పసుపు, మొక్కజొన్న, సొయా బీన్ పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని 2016లో బీజేపీ ప్రభుత్వం చెప్పిందన్నారు. పరిశ్రమల ఏర్పాటును వేగంగా ముందుకు తీసుకెళతామని ప్రభుత్వం మాట ఇచ్చిందని తెలిపారు.

ఓ తెలంగాణ పారిశ్రామిక వేత్త ముందుకు వచ్చినా సీఎం అందుబాటులోకి రాలేదన్నారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తనకు పెట్టుబడులు లేకుండా వాటాలివ్వాలని బెదిరించారని ఆరోపించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని తెలంగాణ పారిశ్రామికవేత్తను ఎమ్మెల్యే బెదిరించారని పేర్కొన్నారు. టీఎస్ఐఐసీ నుంచి ఇక్కడ ఒక సూపర్ వైజర్ ను నియమించాల్సి ఉన్నా.. ఆ దిశగా చర్యలు లేవని విమర్శించారు. జోనల్ కమిషనర్ తో ఫోన్ లో మాట్లాడాలని ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదన్నారు.

Revanth Reddy : మంత్రి ప్రశాంత్ రెడ్డిని జైల్లో పెడతాం-రేవంత్ రెడ్డి

నందిపేట సెజ్ కల్వకుంట్ల అవినీతికి బలై పోయిందని విమర్శించారు. కేసీఆర్ ఆర్భాటపు ప్రకటనల్లో నిజం లేదని వెల్లడించారు. ఇక్కడ ఎలాంటి పనులు జరగడం లేదని.. అభివృద్ధి జరగడం లేదని విమర్శించారు. ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు చేయాలంటే ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి 30శాతం కప్పం కట్టాల్సిందేనట అని వెల్లడించారు. అభివృద్ధికి అడ్డంకిగా మారిన జీవన్ రెడ్డిని ఈ ప్రాంత రైతులు ఓడించాలని పిలుపునిచ్చారు. బీజేపీ ఎంపీ కేంద్రం నుంచి కావాల్సిన నిధులు తెచ్చి ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేసేలా చూడాలన్నారు.

గతంలో పతంజలి కంపెనీ ఇక్కడ ఏర్పాటు చేస్తున్నామని కవిత పెద్ద ప్రచారం చేశారని పేర్కొన్నారు. కానీ ఇప్పటికీ ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు కాలేదన్నారు. రాందేవ్ బాబాతో మాట్లాడి పరిశ్రమను ఇక్కడ ఏర్పాటు చేసేలా ఇక్కడి ఎంపీ కృషి చేయాలన్నారు. తక్షణమే ఇక్కడ పరిశ్రమల ఏర్పాటుపై కేసీఆర్ రివ్యూ చేయాలని డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించిన అన్ని రకాల అనుమతులు ఇవ్వాలన్నారు.