Telangana : కేసీఆర్ తప్ప..ద‌ళితుల‌కు రూ.10 ల‌క్ష‌లు ఇచ్చిన మ‌గాడు దేశంలో ఉన్నాడా? : KTR

దేశంలో కేసీఆర్ తప్ప దళితులకు రూ.10 లక్షలు ఇచ్చిన మగాడు ఉన్నారా? అంటూ మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ అన్నారు.

Telangana : కేసీఆర్ తప్ప..ద‌ళితుల‌కు రూ.10 ల‌క్ష‌లు ఇచ్చిన మ‌గాడు దేశంలో ఉన్నాడా? : KTR

Minister Ktr Comments On Union Government

Minister KTR comments on union government : దేశంలో కేసీఆర్ తప్ప దళితులకు రూ.10 లక్షలు ఇచ్చిన మగాడు ఉన్నారా? అంటూ టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ అన్నారు. గురువారం ఆంబేద్కర్ జ‌యంతిని సందర్భంగా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభత్వంపై మరోసారి విరుచుకుపడ్డారు. దళిత బంధు విజయవంతమైతే దేశం యావత్తు తెలంగాణ వైపే చూస్తుంది అని దేశంలో ద‌ళితుల‌కు రూ.10 ల‌క్ష‌లు ఇచ్చిన మ‌గాడు ఉన్నాడా? అంటూ వ్యాఖ్యానించారు కేటీఆర్. మా ప్రభుత్వం ద‌ళితుల అభ్యున్న‌తి కోసం ద‌ళిత బంధు పేరిట ప్ర‌తి ద‌ళిత కుటుంబానికి రూ.10ల‌క్ష‌లు ఇచ్చే ప‌థ‌కానికి రూప‌క‌ల్పన చేశామ‌ని..తెలంగాణ పారిశ్రామికాభివృద్ధిలో దళితులకు పెద్దపీట వేశామని తెలిపారు.

Also read : Covid-19 : ఢిల్లీ స్కూల్లో కరోనా కలకలం..!టీచర్, విద్యార్థికి పాజిటివ్‌..!!

ఈ ప్రపంచంలో ఉన్నవి రెండే రెండు కులాలు. ఒకటి ఉన్నోవారు. అమెరికాలో కూడా రెండు కులాలున్నాయి. ఒకటి నల్లోడు, రెండు తెల్లోడు హైదరాబాద్ లో ఉండే మాకు కులాల పట్టింపులు ఉండదని కేటీఆర్ ఈ సందర్భంగా అన్నారు. కానీ దేశంలో కులం, మతం పిచ్చి పెరుగుతోంది అని అన్న కేటీఆర్ అంబేద్కర్ రాజ్యాంగం మోడీ చేతుల్లోకి వెళ్లిపోయిందని అన్నారు. తెలంగాణను మా ప్రభుత్వం అభివృద్ధి పథంలో నడిపిస్తుంటే కేంద్రం ప్రభుత్వం ఓర్వలేక అభివృద్ధికి అడ్డుపడుతోంది అని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కేటీఆర్ విరుచుకుపడ్డారు. కేంద్రం నిరంకుశ పాలనపై అందరం కలిసి పోరాటం చేయాలి అని కేటీఆర్ పిలుపునిచ్చారు.

రాజ్యాంగాన్ని తుంగ‌లో తొక్కుతున్న‌ది ఎవ‌రో ఆలోచించాలని.. వ్య‌వ‌స్థ‌ల‌ను కుప్ప‌కూలుస్తున్న‌ది ఎవ‌రు? వ్య‌వ‌స్థ‌ల‌ను అడ్డం పెట్టుకుని రాజ‌కీయం చేస్తున్నారంటూ విమర్శించారు. మంచి ప‌నులు చేస్తుంటే కేంద్రం అడ్డుప‌డుతోంది. మంచి చెడుల‌ను ప్ర‌జ‌లు ఎన్నిక‌ల్లో చూసుకుంటారు. ద‌ళితుల‌కు రూ.10 ల‌క్ష‌లు ఇచ్చిన మ‌గాడు దేశంలో ఉన్నాడా? బ‌ల‌హీన వ‌ర్గాల కోసం బ‌లంగా ప‌నిచేసే సీఎం ఈ దేశంలో ఎక్క‌డైనా ఉన్నాడా? అంటూ కేటీఆర్ తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు.