YS Sharmila Arrested: వైఎస్ షర్మిల మౌనదీక్ష భగ్నం.. సీఎం కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు

రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల ట్యాంక్ బండ్ పై మౌన దీక్షకు దిగారు. దీక్షను పోలీసులు భగ్నం చేశారు.

YS Sharmila Arrested: వైఎస్ షర్మిల మౌనదీక్ష భగ్నం.. సీఎం కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు

YS sharmila

YS Sharmila Arrested: రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల ట్యాంక్ బండ్ పై మౌన దీక్షకు దిగారు. మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళల పట్ల వివక్షత ప్రదర్శిస్తుందని ఆరోపిస్తూ.. ట్యాంక్‌బండ్ పై రాణి రుద్రమదేవి విగ్రహం వద్ద మౌన దీక్షను చేపట్టారు. ఈ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, వైఎస్ఆర్‌టీపీ నేతలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. పోలీసులు షర్మిలను బలవతంగా దీక్షా స్థలినుంచి బొల్లారం పోలీస్ స్టేషన్ తరలించారు. కొద్దిసేపటి అనంతరం లోటస్ పాండ్‌కు షర్మిలను తరలించారు.

YS Sharmila: మాపై దాడులు చేసి.. మళ్లీ మా పాదయాత్రనే ఆపేశారు ..

ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ..  సీఎం కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. మహిళలకు భద్రత కల్పిస్తున్నామని కేసీఆర్ ప్రభుత్వం పచ్చి అబద్దాలు చెబుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతీయేటా రాష్ట్రంలో 20వేల అత్యాచారాలు జరుగుతున్నాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రం అత్యాచారాల విషయంలో నెంబర్ వన్ గా ఉందని, మహిళలను ఎత్తుకు పోవడంలోకూడా రాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో ఉందని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. మహిళలను సీఎం కేసీఆర్ కేవలం ఓట్లువేసే యంత్రాల మాదిరిగానే చూస్తున్నాడని, కేసీఆర్ కు మహిళల పట్ల చిత్తశుద్ది లేదని విమర్శించారు. మహిళ భద్రతకు చిన్నదొర కేటీఆర్ భరోసా యాప్ అని చెప్పాడని, ఆ భరోసా యాప్ ఎక్కడ ఉందని షర్మిల ప్రశ్నించారు.

YS Sharmila : నన్ను మరదలు, శిఖండి అంటే తప్పు లేదా? : వైఎస్ షర్మిల

తెలంగాణ రాష్ట్రం మహిళలకు ఒక ల్యాండ్‌మైన్‌లా తయారైందని, మహిళల పట్ల ఎక్కడ ఏ బాంబ్ పేలుతుందో తెలియదన్నారు. గడిచిన ఐదేళ్లలో వేల కేసులు నమోదయ్యాయని, టీఆర్ఎస్ కార్యకర్తలు ఎంతో మంది మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారని షర్మిల ఆరోపించారు. కేటీఆర్ నియోజక వర్గంలోకూడా మైనర్లపై అత్యాచారం జరిగితే దిక్కులేదని అన్నారు. హైదరాబాద్ నడిబొడ్డున పట్టపగలు అత్యాచారం జరిగితే దిక్కు లేదని, స్వయంగా మంత్రుల బంధువులు రేప్‌లు చేసినా దిక్కులేదంటూ షర్మిల విమర్శించారు. కేసీఅర్‌కు ఆడవాళ్లంటే వివక్ష అని, ఆడవాళ్లు అంటే కక్ష్య అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. దళిత మహిళలు అని చూడకుండా దాడులు చేస్తున్నారని, దళిత మహిళలను లాకప్ డెత్‌లు చేస్తున్నారని, తెలంగాణ‌లో ఓకేఒక్క మహిళల కవిత‌కు మాత్రమే రక్షణ ఉందంటూ తెలంగాణ ప్రభుత్వంపై షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.