ప్రభాస్‌కు అమ్మగా భాగ్యశ్రీ రీ-ఎంట్రీ: బాలకృష్ణ సినిమాలో చివరిసారిగా!

  • Published By: vamsi ,Published On : January 22, 2020 / 01:31 PM IST
ప్రభాస్‌కు అమ్మగా భాగ్యశ్రీ రీ-ఎంట్రీ: బాలకృష్ణ సినిమాలో చివరిసారిగా!

‘మైనే ప్యార్ కియా’ సినిమాతో బాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా మారిపోయిన నటి గుర్తుందా? ఆమె ఎవరో కాదు ‘భాగ్యశ్రీ’. ఆ సినిమాలో సల్మాన్‌తో కలిసి ఆమె చేసిన సందడి ఇప్పటికి మర్చిపోలేం.. ‘మైనే ప్యార్ కియా’ సినిమాతో దేశం మొత్తాన్ని ఒక ఊపు ఊపిన అందాల భాగ్యశ్రీ.. ఆ సినిమా డబ్బింగ్ వెర్షన్లతో దేశం మొత్తానికి కూడా పరిచయం అయ్యింది. అయితే 80వ దశకంలో తన అందం, నటనతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న భాగ్యశ్రీ.. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంది.

త్వరలోనే గ్రాండ్‌గా రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమవుతున్న ఈ భామ స్టార్ హీరో ప్రభాస్‌కు అమ్మగా నటించేందుకు సిద్ధం అయ్యింది. రాధాకృష్ణ డైరెక్షన్‌లో ప్రభాస్ జాన్ అనే సినిమా చేస్తుండగా.. భాగ్యశ్రీ ఈ చిత్రంలో ప్రభాస్‌ తల్లి పాత్రలో కనిపించబోతుంది. గతంలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన రాణా సినిమాలో చెల్లెలి పాత్రలో ఆమె నటించింది. తర్వాత ఎప్పుడూ తెలుగు సినిమాల్లో కనిపించలేదు.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తల్లి పాత్ర జాన్ సినిమాలో కీలకమని.. ఆ పాత్రకు అనేక ఆప్షన్లు పరిశీలించి చివరికి భాగ్యశ్రీని ఖరారు చేసినట్లు దర్శకులు చెబుతున్నారు. ఈ సినిమాతో ఆమె ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేయడం ఖాయమని అంటున్నారు. పాన్ ఇండియా సినిమాగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ‘సాహో’ సినిమాను నిర్మించిన యువి క్రియేషన్స్ అధినేతలతో కలిసి ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇది పునర్జన్మల నేపథ్యంలో సాగే ప్రేమకథ అని సమాచారం.