జోగి రమేష్ను వదిలిపెట్టని నకిలీ లిక్కర్ ఎపిసోడ్.. మెంటల్ టార్చర్గా మారిన ఐవీఆర్ఎస్ కాల్స్
లిక్కర్ కేసు నిందితుడితో పాటు కూటమి నేతలు చేస్తున్న అలిగేషన్స్ను తిప్పికొట్టడానికే నానా తంటాలు పడుతున్నారు జోగి రమేష్. ఇది చాలదన్నట్లుగా ఇప్పుడు మరో ఆయనకు మరో తలనొప్పి వచ్చి పడింది.
Jogi Ramesh: నకిలీ లిక్కర్ ఇష్యూ గాలి దుమారం అంత వ్యాపించి..ఒక్కసారిగా సైలెంట్ అయింది. వైసీపీ ఆ అంశంపై అప్పటంత సీరియస్గా రియాక్ట్ కావడం లేదు. టీడీపీ మాత్రం ప్లాన్ ప్రకారమే ముందుకెళ్తోందట. ఇప్పటికే జనార్ధన్రావు వీడియో వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ చుట్టూ రచ్చ నడుస్తోంది. కూటమి సర్కార్ను బద్నాం చేసేందుకు నకిలీ మద్యం తయారీ చేశారని జనార్ధన్రావు చెప్పడంతో..ఇష్యూ కొత్త టర్న్ తీసుకుంటుంది.
లిక్కర్ కేసు నిందితుడితో పాటు కూటమి నేతలు చేస్తున్న అలిగేషన్స్ను తిప్పికొట్టడానికే నానా తంటాలు పడుతున్నారు జోగి రమేష్. ఇది చాలదన్నట్లుగా ఇప్పుడు మరో ఆయనకు మరో తలనొప్పి వచ్చి పడింది. అదే ఐవీఆర్ఎస్ కాల్స్. అంటే ఒక సమాచారాన్ని ఒకే సమయంలో వేల మందికి చేరవేడానికి ఈ టెక్నాలజీని వాడుకుంటారు. (Jogi Ramesh)
Also Read: తెలంగాణ మంత్రుల పంచాయితీపై అధిష్టానం ఆరా.. వరుస పరిణామాలపై ఏం జరిగిందంటే?
కంప్యూటర్ ద్వారా మొబైల్ కాల్స్ చేయించి తాము అనుకున్న విషయాన్ని ప్రజలకు చేరవేస్తారు. అయితే ఇన్నాళ్లూ ఈ టెక్నాలజీని ఎన్నికల ప్రచారానికి, లీడర్లపై ప్రజాభిప్రాయ సేకరణకు వాడితే, కూటమి ప్రభుత్వం మాత్రం సరికొత్తగా వాడుతోందట. తమ రాజకీయ ప్రత్యర్థులను ఇమేజ్ను డామేజ్ చేసే అస్త్రంగా ఐవీఆర్ఎస్ కాల్స్ చేయడం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది.
ఏపీలో తీవ్ర చర్చనీయాంశమైన నకిలీ మద్యం విక్రయాలపై అసలు నిందితులు, కుట్రదారులు అంటూ కొందరి పేర్లతో ప్రజలకు ఐవీఆర్ఎస్ కాల్స్ వెళ్తున్నాయి. ఇందులో మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేష్ పేరును ప్రస్తావిస్తుండటంతో ఆయన షాక్కు గురయ్యారు. ఈ విషయమై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేశారు. అన్నమయ్య జిల్లా మునకలచెరువులో కల్తీ మద్యం ఫ్యాక్టరీని ఎక్సైజ్ అధికారులు గుర్తించి సీజ్ చేయడంతో పెద్ద చర్చగా మారింది.
ఇద్దరిపై సస్పెన్షన్
ఈ వ్యవహారంలో ఇద్దరు టీడీపీ నేతలకు సంబంధం ఉందని ఆరోపణలు రావడంతో ఆ పార్టీ ఇద్దరినీ సస్పెండ్ చేసింది. ఇదే సమయంలో ఏ1 జనార్ధన్రావుకు మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేష్తో సంబంధాలు ఉన్నట్లు ప్రచారం జరిగింది. జోగి రమేష్ సూచనలతో ప్రభుత్వంపై బురద జల్లడానికే మద్యం కల్తీ చేశామని జనార్దనరావు వీడియో విడుదల చేయడంతో కలకలం రేపింది. ఈ వ్యవహారంపై అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం కొనసాగుతోంది. అదే సమయంలో మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్టు జరిగే అవకాశం ఉందన్న ప్రచారం జరిగింది.
జోగి రమేష్పై ఇంతవరకు నకిలీ మద్యంకు సంబంధించి ఎలాంటి కేసు నమోదు కాలేదు. మరోవైపు జోగి టార్గెట్గానే సిట్ దర్యాప్తు ప్రారంభమైందన్న ప్రచారం జరుగుతోంది. దీంతో జోగి రమేష్ను టెన్షన్ పెట్టేలా ప్రభుత్వం వ్యూహాత్మకంగా పావులు కదుపుతోందన్న టాక్ వినిపిస్తోంది. ఇదే సమయంలో నకిలీ మద్యానికి జోగి రమేష్ కారణమని జనాలకు ఐవీఆర్ఎస్ కాల్స్ వస్తుండటం సంచలనంగా మారింది.
దీని వెనుక టీడీపీ హస్తం ఉందని ఆరోపిస్తున్న జోగి రమేష్.. ఐవీఆర్ఎస్ కాల్స్పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. తన పాత్రపై ఎటువంటి ఆధారం లేకుండా తన పరువుకు నష్టం జరిగేలా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడుతున్నారు జోగి రమేష్. దీంతో ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఎలాంటి కేసు నమోదు కాకుండానే..జనార్ధన్రావు ఆరోపణలు, ఐవీఆర్ఎస్ కాల్స్తోనే జోగి రమేష్ కూటమి చేయాల్సినంత బద్నాం చేస్తుందన్న గుసగుసలు అయితే వినిపిస్తున్నాయి.
