Dil Raju : బాహుబలిని కూడా ట్రోల్ చేశారు.. ఇప్పుడు ఆదిపురుష్.. కొంతమంది కావాలని చేస్తున్నారు..

దిల్ రాజు మాట్లాడుతూ.. ''ప్రభాస్ ఫ్యాన్స్ లాగే నేను కూడా ఆదిపురుష్ టీజర్ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూశాను. టీజర్ చూసిన తర్వాత ప్రభాస్ కి కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. వాట్సాప్ లో వాయిస్ మెసేజ్ పెట్టాను టీజర్ అదిరిపోయింది అని. నా చుట్టుపక్కన ఉన్న వాళ్ళని............

Dil Raju : బాహుబలిని కూడా ట్రోల్ చేశారు.. ఇప్పుడు ఆదిపురుష్.. కొంతమంది కావాలని చేస్తున్నారు..

Dil Raju comments on Adipurush Trolls

Dil Raju :  ప్రభాస్ నటిస్తున్న భారీ సినిమా ఆదిపురుష్ నుంచి ఇటీవల టీజర్ రిలీజ్ అయింది. విజువల్ గా చూడటానికి బాగున్నా రామాయణం కథ అని చెప్పి ఏదో గ్రాఫిక్స్, హాలీవుడ్ సినిమాలాగా ఉండటంతో ఆదిపురుష్ పై భారీగా ట్రోల్స్ వస్తున్నాయి. ఆ టీజర్ లో రామాయణం అసలు ఎక్కడుంది అని చాలా మంది విమర్శిస్తున్నారు. తాజాగా ఆదిపురుష్ టీజర్ ని 3Dలో రిలీజ్ చేశారు. గురువారం సాయంత్రం AMB మాల్ లో ఆదిపురుష్ 3D టీజర్ విడుదల చేశారు. నేడు రెండు రాష్ట్రాల్లో పలు థియేటర్స్ లో ఆదిపురుష్ టీజర్ ని విడుదల చేయనున్నారు.

ఈ కార్యక్రమానికి ప్రభాస్, ఆదిపురుష్ టీంతో పాటు దిల్ రాజు, పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 3D టీజర్ స్క్రీనింగ్ అయిన తర్వాత అందరూ మీడియాతో మాట్లాడారు. దిల్ రాజు మాట్లాడుతూ.. ”ప్రభాస్ ఫ్యాన్స్ లాగే నేను కూడా ఆదిపురుష్ టీజర్ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూశాను. టీజర్ చూసిన తర్వాత ప్రభాస్ కి కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. వాట్సాప్ లో వాయిస్ మెసేజ్ పెట్టాను టీజర్ అదిరిపోయింది అని. నా చుట్టుపక్కన ఉన్న వాళ్ళని కొంతమందిని అడిగాను. కొంతమంది బాగోలేదు అన్నారు. నేను మళ్ళీ ఇంట్లో పెద్ద టీవీలో చూశాను. నాకు ఆదిపురుష్ టీజర్ బాగా నచ్చింది.”

BiggBoss 6 Day 32 : కొత్త కెప్టెన్ కోసం టాస్కులు.. కంటెస్టెంట్ల కోరికలు.. ఎమోషనల్ ఎపిసోడ్..

”ఆదిపురుష్ టీజర్ ని ట్రోల్ చేస్తున్నారు చాలా మంది. బాహుబలి సినిమా రిలీజయినప్పుడు కూడా మొదటి రెండు రోజులు చాలా ట్రోల్ చేశారు. కానీ ప్రభాస్ కి అప్పుడే చెప్పా సినిమా పెద్ద హిట్ అవుతుందని. బాహుబలిని అప్పుడు ట్రోల్ చేశారు, పెద్ద హిట్ అయింది. ఇప్పుడు ఆదిపురుష్ ని ట్రోల్ చేస్తున్నారు. ఇది కూడా కచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది. ఇవి ఫోన్ లో చూసే సినిమాలు కావు, అందుకే టీజర్ కొంతమందికి నచ్చకపోవచ్చు. ఇలాంటి విజువల్ వండర్స్ థియేటర్స్ లో చూస్తేనే నచ్చుతాయి”

దర్శకుడు ఓం రౌత్ రామాయణం కథని మాత్రమే తీసుకున్నాడు, పాత్రలని, కథనాన్ని కొత్తగా ఒక విజువల్ వండర్ లా చూపించబోతున్నాడు. థియేటర్ లో ఈ సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులే చెప్తారు పెద్ద హిట్ అని. మొదటి రెండు రోజులు నెగిటివ్ టాక్ వస్తుంది. ప్రతి సినిమాకి ఇది చాలా కామన్. ఇటీవల ఈ నెగిటివ్ టాక్ కావాలని కొంతమంది తెస్తున్నారు. ఇప్పుడు ఎంత ట్రోల్ చేసినా సంక్రాంతికి ఆదిపురుష్ సినిమా భారీ హిట్ అవ్వబోతుంది” అని అన్నారు.