SSMB29: మహేష్-రాజమౌళి మూవీపై కన్నేసిన హాలీవుడ్ బడా కంపెనీ..?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన కెరీర్‌లోని 28వ చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇప్పటికే తొలి షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకుని, త్వరలోనే రెండో షెడ్యూల్ షూటింగ్ కోసం రెడీ అవుతోంది. ఇక ఈ సినిమా తరువాత మహేష్ తన కెరీర్‌లోనే ప్రెస్టీజియస్ మూవీని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.

SSMB29: మహేష్-రాజమౌళి మూవీపై కన్నేసిన హాలీవుడ్ బడా కంపెనీ..?

Disney Eyes On Mahesh Babu Rajamouli SSMB29 Biggest Flick

SSMB29: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన కెరీర్‌లోని 28వ చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇప్పటికే తొలి షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకుని, త్వరలోనే రెండో షెడ్యూల్ షూటింగ్ కోసం రెడీ అవుతోంది. ఈ సినిమాలో మహేష్ మరోసారి అల్ట్రా స్టైలిష్ లుక్‌లో కనిపిస్తుండగా, ఈ సినిమాను త్రివిక్రమ్ తనదైన మార్క్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నాడు. ఇక ఈ సినిమా తరువాత మహేష్ తన కెరీర్‌లోనే ప్రెస్టీజియస్ మూవీని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.

SSMB29: మహేష్-రాజమౌళి సినిమాలో ఆ హాలివుడ్ స్టార్ నటుడు.. నిజమేనా?

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అప్పుడే భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్‌గా రాజమౌళి క్రియేట్ చేసిన సునామీ మనం చూశాం. ఇక మహేష్ లాంటి స్టార్‌డమ్ ఉన్న హీరోతో ఓ అడ్వెంచెరస్ మూవీని తెరకెక్కించబోతున్నట్లు జక్కన్న అనౌన్స్ చేసిన దగ్గర్నుండీ ఈ కాంబినేషన్‌పై కేవలం ఇండియాలోనే కాకుండా యావత్ ఆసియాలో ఈ సినిమాపై క్రేజ్ క్రియేట్ అయ్యింది. అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ సినిమాను అడవి నేపథ్యంలో తెరకెక్కించబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. అయితే ఇప్పుడు ఈ సినిమాపై హాలీవుడ్‌కు చెందిన ఓ బడా కంపెనీ కన్నేసినట్లుగా తెలుస్తోంది.

SSMB29 : రాజమౌళి-మహేష్ సినిమా అదే.. హాలీవుడ్ ఫిలిం ఫెస్టివల్లో మహేష్ సినిమా గురించి చెప్పిన రాజమౌళి..

ఇండియానా జోన్స్ తరహా మూవీగా ఈ సినిమాను తీర్చిదిద్దేందుకు జక్కన్న అండ్ టీమ్ రెడీ అవుతుండటంతో, హాలీవుడ్ నిర్మాణ సంస్థ డిస్నీ ఈ సినిమాతో టైఅప్ అవ్వాలని ప్రయత్నిస్తుందట. ఇప్పటికే ఇండియాలో తమ కార్యకలాపాలు స్టార్ట్ చేసిన డిస్నీ, రాజమౌళి-మహేష్ మూవీని ప్రపంచవ్యాప్తంగా ప్రమోట్ చేసి ఈ సినిమాతో కళ్లుచెదిరే బిజినెస్‌ను చేసుకోవాలని అప్పుడే ప్లాన్ చేస్తోంది. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందనే విషయం పక్కనబెడితే, జక్కన్న సినిమా కోసం కేవలం ఇండియాలోనే కాకుండా వరల్డ్ వైడ్‌గా ఎలాంటి క్రేజ్ నెలకొందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ సినిమాను వచ్చే మే లేదా జూన్ నెలలో పట్టాలెక్కించేందుకు రాజమౌళి అండ్ టీమ్ గట్టిగానే ప్లాన్ చేస్తున్నారట.