Puri Jagannadh : ముంబైలో పూరితో సెల్ఫీ లేదని బాధపడిన ఇంటర్ కుర్రాడు.. వీడియో షేర్ చేసిన ఛార్మి
ముంబైలో కార్ లో వెళ్తుంటే ఓ కుర్రాడితో పూరి మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోను ఛార్మి షేర్ చేసింది.
Puri Jagannadh : డైరెక్టర్ పూరి జగన్నాద్ ప్రస్తుతం లైగర్ షూటింగ్ కోసం ముంబయి వెళ్లారు. మొన్నటి దాకా తన కొడుకు ఆకాష్ సినిమా రొమాంటిక్ ప్రమోషన్స్ లో బిజీగా ఉండి నిన్న ముంబై వెళ్లారు. నేటి నుంచి లైగర్ సినిమా చిత్రీకరణ ప్ర్రారంభమవనుంది. అయితే నిన్న ముంబైలో కార్ లో వెళ్తుంటే ఓ కుర్రాడితో పూరి మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోను ఛార్మి షేర్ చేసింది.
ఇన్ స్టా లో ఛార్మి వీడియో షేర్ చేసింది. ఈ వీడియోలో కనపడే కుర్రాడి పేరు ప్రమోద్. ప్రమోద్ పూరి ని చూసి షాక్ అయ్యాడు. సెల్ఫీ తీసుకోవాలంటే ఫోన్ లేదు అంటూ బాధ పడ్డాడు. అతడికి పూరి అంటే చాలా ఇష్టం అని చెప్పాడు. తాను తెలుగు వాడని, ఇంటర్ చదువుతున్నాను అని చెప్పాడు. ముంబయి రోడ్డు మీద టీఎస్ రిజిస్ట్రేషన్ తో ఉంటే ఎవరో తెలుగు వారు అనుకున్నాను. కాని మీరు ఉండటం చాలా ఆశ్చర్యంగా అనిపించిందని ప్రమోద్ అన్నాడు.
Mehaboob Dilse : సొంతిల్లు కట్టుకున్న బిగ్ బాస్ కంటెస్టెంట్.. మీ వల్లే అంటూ ఎమోషనల్ పోస్ట్..
అతడు సెల్ఫీ తీసుకోలేక పోయాడు. అందుకే ఆ వీడియోను షేర్ చేస్తున్నాను. ఈ వీడియోను ప్రమోద్ గుర్తుగా ఉంచుకుంటాడు. సెల్ఫీ తీసుకోలేక పోయాను అంటూ బాధ పడిన ప్రమోద్ కోసం ఈ వీడియో అంటూ ఛార్మి పోస్ట్ చేసింది. ఇదే వీడియోలో లైగర్ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ కి రిలీజ్ చేస్తా అని పూరి ఆ కుర్రాడితో చెప్పాడు.
This cute kid came across #purijagannadh in mumbai traffic signal .. was mesmerised seeing him ,this post is specially for Pramod , because he mentioned he wanted a selfie but unfortunately didn’t have a phone ..@PuriConnects pic.twitter.com/t1JiDdJlhH
— Charmme Kaur (@Charmmeofficial) October 25, 2021