Acharya : ‘చిరుత’నయుడు.. టీజర్ చివరి షాట్ అదిరిందిగా
మెగాస్టార్ - మెగా పవర్స్టార్.. కొరటాల ‘ఆచార్య’ అంచనాలను మరింత పెంచేసిన ‘సిద్ధ’ టీజర్...
Acharya: మెగాస్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో.. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్, కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్లపై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి కలిసి నిర్మిస్తున్న ప్రెస్టీజియస్ ఫిల్మ్ ‘ఆచార్య’.. మొన్నామధ్య విడుదల చేసిన టీజర్ సినిమా మీద అంచనాలు పెంచేసింది.
ఆదివారం ‘ఆచార్య’ లో రామ్ చరణ్ చేస్తున్న సిద్ధ క్యారెక్టర్ టీజర్ విడుదల చేశారు. చరణ్ సరికొత్త క్యారెక్టర్లో డిఫరెంట్ గెటప్లో కనిపించి ఆకట్టుకున్నాడు. మెగా ఫాదర్ అండ్ సన్ అభిమానులతో పాటు ప్రేక్షకులను నెవర్ బిఫోర్ అనేలా ఎంటర్టైన్ చెయ్యబోతున్నారు.
Chiranjeevi : శివ శంకర్ మాస్టర్ కుటుంబానికి చిరంజీవి సాయం
టీజర్లో ఆర్ఆర్లో వచ్చే శ్లోకంతో సిద్ధ క్యారెక్టరైజేషన్ని ఎలివేట్ చేయడం బాగుంది. మణిశర్య బ్యాగ్రౌండ్ స్కోర్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. తిరు విజువల్స్ బాగున్నాయి. ‘ధర్మస్థలికి ఆపదొస్తే.. అది జయించడానికి అమ్మోరు తల్లే మాలో ఆవహించి ముందుకుపంపుద్ది’ అంటూ చరణ్ చెప్పిన డైలాగ్ అలరిస్తోంది.
Ram Charan : రామ్ చరణ్ వాచ్ అదిరింది.. కాస్ట్ ఎంతో తెలుసా..!
ఇదిలా ఉంటే టీజర్ చివరి షాట్ గురించి నెట్టింట పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి. అడవిలో ఓవైపు ఒడ్డున చిరుత నిలబడి ఉండగా చిరుత పిల్ల నీళ్లు తాగుతుంటుంది. అలా పాన్ చేస్తే మరోవైపు చిరు నిలబడి ఉంటే చరణ్ నీళ్లు తాగుతుంటాడు. ఈ ఒక్క షాట్తో ఫ్యాన్స్ అండ్ మూవీ లవర్స్కి ఫుల్ కిక్ ఇచ్చారు డైరెక్టర్ కొరటాల.
Allu Arjun : ‘అఖండ’ గురించి వైరల్ అవుతున్న బన్నీ పోస్టులు..
ఈ షాట్కి థియేటర్లలో మెగాభిమానుల రచ్చ ఏ రేంజ్లో ఉంటుందో ఊహించుకోవచ్చు. చిరుకి జోడీగా కాజల్ అగర్వాల్, చరణ్ సరసన పూజా హెగ్డే కథానాయికలుగా నటిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ‘ఆచార్య’ ఫిబ్రవరి 4న భారీ స్థాయిలో విడుదల కానుంది.