Roja : అన్‌స్టాపబుల్‌ షోకి చచ్చినా వెళ్ళను.. ఆల్రెడీ రెండు సార్లు అడిగారు.. రోజా సంచలన వ్యాఖ్యలు..

విజయవాడ భవాని ఐలాండ్ లో జరిగిన సంక్రాంతి సంబరాల్లో ఏపీ మంత్రి రోజా పాల్గొంది. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడగా అన్‌స్టాపబుల్‌ షోకు వెళ్లే అవకాశం ఉందా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దీనికి రోజా సమాధానమిస్తూ..............

Roja : అన్‌స్టాపబుల్‌ షోకి చచ్చినా వెళ్ళను.. ఆల్రెడీ రెండు సార్లు అడిగారు.. రోజా సంచలన వ్యాఖ్యలు..

Roja sensational comments on Balakrishna Unstoppable show

Roja :  బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్‌స్టాపబుల్‌ షో ఆహా ఓటీటీలో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. ఇప్పటికే సీజన్ 1 సక్సెస్ అయిన తర్వాత సీజన్ 2 మరింత ఆసక్తిగా ప్రజల్లోకి వెళ్తుంది. ఇక సీజన్ 2 లో ప్రభాస్ ఎపిసోడ్స్ తో దేశమంతటా ఆహా ఓటీటీ పేరు బాగా వినిపించింది. త్వరలో పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కూడా స్ట్రీమ్ అయింది. ఈ అన్‌స్టాపబుల్‌ సీజన్ 2 మొదటి ఎపిసోడ్ కి చంద్రబాబు, లోకేష్ వచ్చి అలరించిన సంగతి తెలిసిందే.

అన్‌స్టాపబుల్‌ సీజన్ 2 లో మొదటి ఎపిసోడ్ కి చంద్రబాబు, లోకేష్ రావడం, ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి రావడం, త్వరలో పవన్ కళ్యాణ్ వస్తుండటంతో దీనికి పొలిటికల్ టచ్ కూడా అంటింది. దీంతో ఈ షో ఏపీలో చర్చగా మారింది. వైసీపీ నేతలు ఈ షోపై బాలకృష్ణపై, షోకి అచ్చిన వారిపై కూడా విమర్శలు చేశారు. తాజాగా నటి, మంత్రి రోజా అన్‌స్టాపబుల్‌ షోపై సంచలన వ్యాఖ్యలు చేసింది.

Pawan Kalyan : కనుమ స్పెషల్.. గోవుల్ని పూజించి ఆహరం అందించిన పవన్..

విజయవాడ భవాని ఐలాండ్ లో జరిగిన సంక్రాంతి సంబరాల్లో ఏపీ మంత్రి రోజా పాల్గొంది. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడగా అన్‌స్టాపబుల్‌ షోకు వెళ్లే అవకాశం ఉందా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దీనికి రోజా సమాధానమిస్తూ.. గతంలో అయితే అన్‌స్టాపబుల్‌ షోకి వెళ్లాలని ఆశగా ఉండేది. నేను, బాలకృష్ణతో కలిసి ఏడు సినిమాలు చేశాను. మాది హిట్ పెయిర్. గతంలో నన్ను ఈ షోకి పిలిచారు కానీ అప్పుడు అసెంబ్లీ సెషన్స్ ఉండటంతో వెళ్లడం కుదరలేదు. మొన్న చంద్రబాబు ఎపిసోడ్ చూశాక ఇంక చచ్చినా వెళ్లకూడదని డిసైడ్ అయ్యాను. ఇప్పుడు అన్‌స్టాపబుల్‌ వాళ్ళు పిలిచినా కూడా వెళ్ళను అని చెప్పింది. దీంతో రోజా చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.