Tamil Heros : ఓటీటీ బాట పడుతున్న తమిళ స్టార్ హీరోలు

తమిళ్ లో స్టార్ హీరోలు వరుసగా తమ సినిమాలని ఓటీటీలో రిలీజ్ చేసుకొని సేఫ్ అవుతున్నారు. ఇటీవల హిట్లు లేని స్టార్ హీరోలు ఓటీటీలో రిలీజ్ చేయడంతో సినిమాలకి మంచి టాక్ వినిపిస్తుంది.

Tamil Heros : ఓటీటీ బాట పడుతున్న తమిళ స్టార్ హీరోలు

Tamil Heros (1)

Tamil Heros :   ఇటీవల కరోనా వల్ల థియేటర్లు క్లోజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ కరోనా ఎప్పుడు ఉంటదో, ఎప్పుడు పోతుందో, థియేటర్స్ కూడా ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు ఉండవో ఎవరికీ తెలియట్లేదు. దీంతో చాలా సినిమాలకి నష్టమే మిగులుతుంది. కరోనా వల్ల ఓటీటీ విపరీతంగా పుంజుకుంది. థియేటర్లు లేకపోవడంతో చాలా మంది తమ సినిమాలని ఓటీటీలోనే రిలీజ్ చేశారు. తెలుగులో చిన్న సినిమాలతో పాటు నాని, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలు కూడా తమ సినిమాలని ఓటీటీలో రిలీజ్ చేయక తప్పలేదు. ఇక తమిళ్ లో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది.

తమిళ్ లో స్టార్ హీరోలు వరుసగా తమ సినిమాలని ఓటీటీలో రిలీజ్ చేసుకొని సేఫ్ అవుతున్నారు. ఇటీవల హిట్లు లేని స్టార్ హీరోలు ఓటీటీలో రిలీజ్ చేయడంతో సినిమాలకి మంచి టాక్ వినిపిస్తుంది. డబ్బులు కూడా వస్తున్నాయి. దీంతో చాలా మంది హీరోలు ఇప్పటికే ఓటీటీలతో ఒప్పందం చేసుకొని సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. కొన్ని సంవత్సరాలుగా విజయాలకు దూరమైన తమిళ్ స్టార్ హీరో సూర్య కరోనా వల్ల తన ‘ఆకాశం నీ హద్దురా’ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేశాడు. ఈ సినిమా ఓటీటీలో ఘన విజయం సాధించింది. ఆ తర్వాత ‘జైభీమ్’ని కూడా ఓటీటీలోనే విడుదల చేశాడు. ఇది కూడా సూపర్‌ హిట్‌ అయింది. ఈ రెండు సినిమాలు దేశమంతటా ఓటీటీలో మంచి విజయం సాధించాయి. సూర్యకి డబ్బుల పరంగా కూడా సేఫ్ అయింది.

Pooja Hegde : ఇప్పటిదాకా నేను చేసిన సినిమాల్లో ఇదే చాలా క్లిష్టమైంది

ఆ తర్వాత మరో తమిళ్ హీరో ఆర్య కూడా తన సినిమా ‘సార్పట్ట’ ఓటీటీలో రిలీజ్ చేసి భారీ విజయం సాధించాడు. అప్పటి వరకు విజయాలకు దూరమైన ఆర్య ‘సార్పట్ట’ సినిమాతో ఓటీటీలో మంచి విజయం సాధించాడు. దీంతో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓటీటీకి వెళ్లిపోవాలని తమిళ హీరోలంతా ఆలోచిస్తున్నారు. ఇదే కోవలో మరో తమిళ్ స్టార్ హీరో కూడా తన నెక్స్ట్ సినిమాని డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు.

Grammy Awards : కరోనా ఎఫెక్ట్.. వాయిదా పడ్డ గ్రామీ అవార్డుల వేడుక

తమిళ్ స్టార్ హీరో విక్రమ్ కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. విక్రమ్ సరైన విజయం సాధించి చాలా కాలం అయింది. ఇప్పుడు విక్రమ్ నుంచి ‘మహాన్’, ‘కోబ్రా’ సినిమాలు రాబోతున్నాయి. మహాన్ లో విక్రమ్ తనయుడు ధ్రువ కూడా నటిస్తున్నాడు. అయితే ఈ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నాడు విక్రమ్. ‘మహాన్’ సినిమాని అమెజాన్ ప్రైమ్ లో జనవరి 26న విడుదల చేస్తారని సమాచారం. ఆ తర్వాత ‘కోబ్రా’ సినిమాని కూడా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేయడానికి ఓటీటీ సంస్థలతో డిస్కషన్స్ జరుపుతున్నారు. ఇలా స్టార్ హీరోలు సైతం తమ సినిమాలని ఓటీటీకి ఇస్తే థియేటర్ల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు.